ఈద్ అల్ ఫితర్: ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసిన యూఏఈ అధ్యక్షుడు
- April 22, 2023
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కుటుంబ ఫోటోను ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పంచుకున్నారు. “సెలవులను కుటుంబం, ప్రియమైనవారితో గడపడం ఒక వరం. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా యూఏఈ, ప్రపంచ ప్రజలు శాంతి, సంతోషాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను" అని యూఏఈ అధ్యక్షుడు తన పోస్ట్లో పేర్కొన్నారు. అతని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కు 3.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. గత సంవత్సరం, ఈద్ అల్ ఫితర్ విరామ సమయంలో షేక్ మొహమ్మద్ తన మనవరాళ్లతో ఫోటోను పంచుకున్నారు. అంతకుముందు రోజు షేక్ మొహమ్మద్ ఎమిరేట్స్ పాలకులు, పౌరులు, నివాసితులు, అరబ్ , ఇస్లామిక్ దేశాల నాయకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ ఈద్ అల్ ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









