ఈద్ అల్ ఫితర్: ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసిన యూఏఈ అధ్యక్షుడు
- April 22, 2023
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కుటుంబ ఫోటోను ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పంచుకున్నారు. “సెలవులను కుటుంబం, ప్రియమైనవారితో గడపడం ఒక వరం. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా యూఏఈ, ప్రపంచ ప్రజలు శాంతి, సంతోషాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను" అని యూఏఈ అధ్యక్షుడు తన పోస్ట్లో పేర్కొన్నారు. అతని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కు 3.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. గత సంవత్సరం, ఈద్ అల్ ఫితర్ విరామ సమయంలో షేక్ మొహమ్మద్ తన మనవరాళ్లతో ఫోటోను పంచుకున్నారు. అంతకుముందు రోజు షేక్ మొహమ్మద్ ఎమిరేట్స్ పాలకులు, పౌరులు, నివాసితులు, అరబ్ , ఇస్లామిక్ దేశాల నాయకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ ఈద్ అల్ ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







