ఈద్ అల్ ఫితర్: ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసిన యూఏఈ అధ్యక్షుడు
- April 22, 2023
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కుటుంబ ఫోటోను ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పంచుకున్నారు. “సెలవులను కుటుంబం, ప్రియమైనవారితో గడపడం ఒక వరం. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా యూఏఈ, ప్రపంచ ప్రజలు శాంతి, సంతోషాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను" అని యూఏఈ అధ్యక్షుడు తన పోస్ట్లో పేర్కొన్నారు. అతని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కు 3.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. గత సంవత్సరం, ఈద్ అల్ ఫితర్ విరామ సమయంలో షేక్ మొహమ్మద్ తన మనవరాళ్లతో ఫోటోను పంచుకున్నారు. అంతకుముందు రోజు షేక్ మొహమ్మద్ ఎమిరేట్స్ పాలకులు, పౌరులు, నివాసితులు, అరబ్ , ఇస్లామిక్ దేశాల నాయకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ ఈద్ అల్ ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







