ఇస్రో శాస్త్రవేత్తలకు ఏపీ సిఎం జగన్ అభినందనలు
- April 22, 2023
అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం తెలిసిందే. ఈ విషయంపై సిఎం జగన్ స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. సాంకేతిక రంగంలో మరో ముందడుగు వేశారని కొనియాడారు. సాంకేతికతను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు.
పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ మొత్తం 25 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం ఈ మధ్యాహ్నం 2.19 గంటలకు శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి రోదసిలోకి దూసుకెళ్లింది. పూర్తిస్థాయి వాణిజ్యపరంగా చేపట్టిన ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇస్రో ప్రణాళికల్లో పూర్తిస్థాయి వాణిజ్యపరమైన ప్రయోగాల్లో ఇది ఐదవది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







