ఇస్రో శాస్త్రవేత్తలకు ఏపీ సిఎం జగన్ అభినందనలు
- April 22, 2023
అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం తెలిసిందే. ఈ విషయంపై సిఎం జగన్ స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. సాంకేతిక రంగంలో మరో ముందడుగు వేశారని కొనియాడారు. సాంకేతికతను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు.
పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ మొత్తం 25 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం ఈ మధ్యాహ్నం 2.19 గంటలకు శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి రోదసిలోకి దూసుకెళ్లింది. పూర్తిస్థాయి వాణిజ్యపరంగా చేపట్టిన ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇస్రో ప్రణాళికల్లో పూర్తిస్థాయి వాణిజ్యపరమైన ప్రయోగాల్లో ఇది ఐదవది.
తాజా వార్తలు
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!









