దోహా మెట్రో, లుసైల్ ట్రామ్ కొత్త సర్వీస్ వేళలు ఇవే
- April 23, 2023
దోహా: ఏప్రిల్ 24 నుండి మెట్రో, లుసైల్ ట్రామ్ కొత్త సర్వీస్ వేళలను ప్రకటించాయి. వారంలో ఏడు రోజులపాటు ఉదయం 5:30 నుండి ప్రయాణికులకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపాయి. కొత్త సర్వీస్ వేళల ప్రకారం.. ఆదివారం నుండి బుధవారం వరకు.. దోహా మెట్రో, లుసైల్ ట్రామ్ ఉదయం 5:30 నుండి రాత్రి 11:59 వరకు అందుబాటులో ఉంటాయి. గురువారం మాత్రం ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే కొనసాగుతుంది. ఇదిలా ఉండగా, శుక్రవారం సర్వీసులు మధ్యాహ్నం 2 గంటల నుండి తెల్లవారుజామున 1 గంటల వరకు.. శనివారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 11:59 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, ఈ సర్వీసులు రమదాన్ వేళలను అనుసరిస్తోంది. దీని ప్రకారం ఇది వారాంతపు రోజులలో ఉదయం 6:30 నుండి తెల్లవారుజామున 1 గంటల వరకు, శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి తెల్లవారుజామున 1 గంటల వరకు పనిచేస్తుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







