వర్షాల కారణంగా ఒమన్లో డిస్టెన్స్ లెర్నింగ్ అమలు
- April 25, 2023
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లో ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా.. విద్యార్థుల భద్రత దృష్ట్యా మంగళవారం డిస్టెన్స్ లెర్నింగ్ ను అమలు చేస్తున్నట్లు సూర్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ మేరకు యూనివర్శిటీ ఆన్లైన్లో ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, లోయలను దాటడం వంటి సహసాలు చేయవద్దని, వరద ప్రాంతాలకు దూరంగా ఉండాలని యూనివర్సిటీ తన ప్రకటనలోసూచించింది. దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్లో ఉన్న వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాల వల్ల కలిగే నష్టాల గురించి నేషనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (NMHEWS) జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









