ఖోర్ ఫక్కన్లో బోటు ప్రమాదం.. భారతీయ ప్రవాసుడు మృతి
- April 25, 2023
యూఏఈ: ఆదివారం ఖోర్ ఫక్కన్లో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో షార్జాకు చెందిన భారతీయ ప్రవాసుడు మరణించాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా మరో ముగ్గురు గాయపడినట్లు షార్జా పోలీసులు ధృవీకరించారు. కాగా, ఏడేళ్ల భారతీయ జాతీయురాలైన చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స కొనసాగుతోందని, ఇతరులు డిశ్చార్జ్ అయ్యారని పోలీసులు తెలిపారు. 38 ఏళ్ల అభిలాష్ సుదీర్ఘ ఈద్ వారాంతంలో ఖోర్ ఫక్కన్ బీచ్లో తన సహచరులతో కలిసి బోటింగ్కు వెళ్లాడు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో మొత్తం 16 మంది ప్రయాణికులు, ఇద్దరు ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అభిలాష్ మృతదేహాన్ని ఖోర్ ఫక్కన్ ఆసుపత్రి నుండి ఫుజైరా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పేపర్ వర్క్ పూర్తిచేసి మృతదేహాన్ని మంగళవారం లేదా బుధవారం నాటికి స్వదేశానికి తరలించాలని భావిస్తున్నట్లు సామాజిక కార్యకర్తలు చెప్పారు. దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన అభిలాష్ షార్జాలోని ఒక ప్రైవేట్ సంస్థలో ఏడేళ్లుగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్..
- ఆరు నెలలకే తొలగింపు.. కోల్కతాలో మెస్సీ విగ్రహం తొలగింపు
- దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయడుకు ఘనస్వాగతం
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!









