ఖోర్ ఫక్కన్లో బోటు ప్రమాదం.. భారతీయ ప్రవాసుడు మృతి
- April 25, 2023
యూఏఈ: ఆదివారం ఖోర్ ఫక్కన్లో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో షార్జాకు చెందిన భారతీయ ప్రవాసుడు మరణించాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా మరో ముగ్గురు గాయపడినట్లు షార్జా పోలీసులు ధృవీకరించారు. కాగా, ఏడేళ్ల భారతీయ జాతీయురాలైన చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స కొనసాగుతోందని, ఇతరులు డిశ్చార్జ్ అయ్యారని పోలీసులు తెలిపారు. 38 ఏళ్ల అభిలాష్ సుదీర్ఘ ఈద్ వారాంతంలో ఖోర్ ఫక్కన్ బీచ్లో తన సహచరులతో కలిసి బోటింగ్కు వెళ్లాడు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో మొత్తం 16 మంది ప్రయాణికులు, ఇద్దరు ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అభిలాష్ మృతదేహాన్ని ఖోర్ ఫక్కన్ ఆసుపత్రి నుండి ఫుజైరా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పేపర్ వర్క్ పూర్తిచేసి మృతదేహాన్ని మంగళవారం లేదా బుధవారం నాటికి స్వదేశానికి తరలించాలని భావిస్తున్నట్లు సామాజిక కార్యకర్తలు చెప్పారు. దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన అభిలాష్ షార్జాలోని ఒక ప్రైవేట్ సంస్థలో ఏడేళ్లుగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







