60 దిర్హామ్ల కోసం ఘర్షణ.. స్వదేశీయుడిని పొడిచిచంపిన ఆసియా వ్యక్తి
- April 25, 2023
దుబాయ్: 60 దిర్హామ్ల కోసం జరిగిన ఘర్షణలో తన దేశానికే చెందిన వ్యక్తిని కత్తితో పొడిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 34 ఏళ్ల ఆసియా జాతీయుడిపై హత్య కేసును దుబాయ్ క్రిమినల్ కోర్టు విచారిస్తోంది. పోలీసుల విచారణ ప్రకారం.. అల్ రిఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురై.. రక్తపు మడుగులో పడిఉన్నాడని అల్-రిఫా పోలీస్ స్టేషన్ కు సమాచారం వచ్చింది. వెంటనే CID బృందాలు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, అతను అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. నిందితుడిని మూడు గంటల్లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.దీంతో పబ్లిక్ ప్రాసిక్యూషన్కు కేసును రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు









