60 దిర్హామ్ల కోసం ఘర్షణ.. స్వదేశీయుడిని పొడిచిచంపిన ఆసియా వ్యక్తి
- April 25, 2023
దుబాయ్: 60 దిర్హామ్ల కోసం జరిగిన ఘర్షణలో తన దేశానికే చెందిన వ్యక్తిని కత్తితో పొడిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 34 ఏళ్ల ఆసియా జాతీయుడిపై హత్య కేసును దుబాయ్ క్రిమినల్ కోర్టు విచారిస్తోంది. పోలీసుల విచారణ ప్రకారం.. అల్ రిఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురై.. రక్తపు మడుగులో పడిఉన్నాడని అల్-రిఫా పోలీస్ స్టేషన్ కు సమాచారం వచ్చింది. వెంటనే CID బృందాలు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, అతను అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. నిందితుడిని మూడు గంటల్లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.దీంతో పబ్లిక్ ప్రాసిక్యూషన్కు కేసును రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయడుకు ఘనస్వాగతం
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..









