షిర్డీ వెళ్లే భక్తులకు శుభవార్త...
- April 27, 2023
హైదరాబాద్: మహారాష్ట్రలోని ప్రసిద్ధ ఆలయం షిర్డీకి హైదరాబాద్ నుంచి ప్రతి ఏడాది వేల సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. షిర్డీలో సాయిబాబాను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే షిర్డీ వెళ్లే భక్తులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ తెలిపింది. హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లే భక్తుల కోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఏసీ, నాన్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏసీ బస్సుల్లో ఛార్జీ పెద్దలకు రూ.3,700, పిల్లలకు రూ.3,010గా నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సుల్లో ఛార్జీ పెద్దలకు రూ.2,400, పిల్లలకు రూ.1,970గా నిర్ణయించారు. అలాగే, హోటల్ రూమ్ ను కూడా తెలంగాణ టూరిజం సమకూర్చనుంది. కాగా, దర్శనం టికెట్లు, ఆహారం ఫీజు మాత్రం ప్యాకేజీలో భాగం కాదు.
ప్రత్యేక ప్యాకేజీతో హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లాలనుకునే భక్తులను సాయంత్రం సమయాల్లో హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, బషీర్ బాగ్, ప్యారడైస్, బేగంపేట్, కేపీహెచ్ బీ, మియాపూర్ ప్రాంతాల్లో తెలంగాణ టూరిజం బస్సులు పికప్ చేసుకోనున్నాయి. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు టూరిజం బస్సులు షిర్డీ చేరుకుంటాయి. హోటల్ గదిలో భక్తులు ఫ్రెషప్ అయిన వెంటనే అదే బస్సుల్లో దర్శనానికి తీసుకెళ్తారు. దర్శనం అనంతరం షిర్డీ సమీపంలోని ఆలయాలకు భక్తులను తీసుకెళ్లనున్నారు.
అనంతరం అదే రోజు సాయంత్రం 4గంటలకు షిర్డీ నుంచి హైదరాబాద్ కు బస్సులు తిరిగి బయల్దేరుతాయి. మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ కు టూరిజం బస్సులు చేరుకోనున్నాయి. మరిన్ని వివరాల కోసం https://tourism.telangana.gov.in /package /shirdiTour ఈ వెబ్ సైట్ ను లాగిన్ కావొచ్చు.
తాజా వార్తలు
- IRGC-అనుబంధ నెట్వర్క్ బస్ట్.. 41 మంది అరెస్ట్..!!
- కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!
- యూఏఈలో ఫ్యూయల్, సాలిక్ , పార్కింగ్ లో మార్పులతో అదనపు భారం..!!
- ఒమన్లోకి అక్రమంగా ప్రవేశించిన 22 మంది అరెస్టు..!!
- ఖతార్లో అమల్లోకి వచ్చిన ఔట్ సైడ్ సమ్మర్ వర్కింగ్ అవర్స్..!!
- ప్రాంతీయ భద్రతపై క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ అధ్యక్షుడు చర్చలు..!!
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- ఎడిసన్లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026









