శ్రీవారి ఆలయం పై హెలికాఫ్టర్లు తిరగడం పై టీటీడీ చైర్మన్

- April 27, 2023 , by Maagulf
శ్రీవారి ఆలయం పై హెలికాఫ్టర్లు తిరగడం పై టీటీడీ చైర్మన్

తిరుమల: తిరుమల ఆలయంపై హెలికాఫ్టర్లు చెక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తిరుమలపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్లు మిలిటరీకి చెందినవని , దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం జోక్యం చేసుకోలేమని తెలిపారు.

గురువారం ఉదయం టీటీడీ ఉద్యోగుల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సులభ కార్మికులు ఆకస్మికంగా విధులు బహిష్కరించి భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. మొదట విధులకు హాజరై ఆ తర్వాత వారి డిమాండ్లు అడిగితే తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నకిలీ వెబ్సైట్‌లు, బ్లాక్‌లో దర్శనం టికెట్లకు కారణం అవుతున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com