శ్రీవారి ఆలయం పై హెలికాఫ్టర్లు తిరగడం పై టీటీడీ చైర్మన్
- April 27, 2023
తిరుమల: తిరుమల ఆలయంపై హెలికాఫ్టర్లు చెక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తిరుమలపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్లు మిలిటరీకి చెందినవని , దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం జోక్యం చేసుకోలేమని తెలిపారు.
గురువారం ఉదయం టీటీడీ ఉద్యోగుల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్ను టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సులభ కార్మికులు ఆకస్మికంగా విధులు బహిష్కరించి భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. మొదట విధులకు హాజరై ఆ తర్వాత వారి డిమాండ్లు అడిగితే తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నకిలీ వెబ్సైట్లు, బ్లాక్లో దర్శనం టికెట్లకు కారణం అవుతున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- IRGC-అనుబంధ నెట్వర్క్ బస్ట్.. 41 మంది అరెస్ట్..!!
- కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!
- యూఏఈలో ఫ్యూయల్, సాలిక్ , పార్కింగ్ లో మార్పులతో అదనపు భారం..!!
- ఒమన్లోకి అక్రమంగా ప్రవేశించిన 22 మంది అరెస్టు..!!
- ఖతార్లో అమల్లోకి వచ్చిన ఔట్ సైడ్ సమ్మర్ వర్కింగ్ అవర్స్..!!
- ప్రాంతీయ భద్రతపై క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ అధ్యక్షుడు చర్చలు..!!
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- ఎడిసన్లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026









