ఉజ్జయిని, జైపూర్‌, పట్నా, గువాహటి, అలహాబాద్‌ రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై..

- May 10, 2016 , by Maagulf
ఉజ్జయిని, జైపూర్‌, పట్నా, గువాహటి, అలహాబాద్‌ రైల్వే స్టేషన్లలో  ఫ్రీ వైఫై..

గూగుల్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత వైఫై సర్వీసులను మరో ఐదు రైల్వే స్టేషన్లకు విస్తరించింది. ఉజ్జయిని, జైపూర్‌, పట్నా, గువాహటి, అలహాబాద్‌ రైల్వే స్టేషన్లలో వైఫై సేవలను ప్రారంభించినట్లు గూగుల్‌ ప్రకటించింది. త్వరలోనే ఈ సేవలను కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు లాంఛనప్రాయంగా ప్రారంభించనున్నట్లు పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 15 రైల్వే స్టేషన్లలో గూగుల్‌ ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి 100 రైల్వే స్టేషన్లలో ఈ సేవలను తీసుకొస్తామని గూగుల్‌ తెలిపింది.భారత రైల్వేకు చెందిన రైల్‌టెల్‌ నెట్‌వర్క్‌ భాగస్వామ్యంతో దేశంలోని 400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలను అందించేందుకు గూగుల్‌ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది 100 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలకు శ్రీకారం చుట్టింది. సెంట్రల్‌ ముంబయి, పుణె, భువనేశ్వర్‌, భోపాల్‌, రాంచీ, రాయ్‌పూర్‌, విజయవాడ, కాచీగూడ, ఎర్నాకులం జంక్షన్‌, విశాఖపట్నం ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సేవలను ప్రారంభించింది. తాజాగా మరో ఐదు స్టేషన్లకు తమ సేవలను విస్తరించింది.ముంబయిలో ప్రారంభించిన ఈ సేవలకు మంచి ఆదరణ లభిస్తోందని.. త్వరలోనే ముంబయి శివారుల్లోని రైల్వేస్టేషన్లలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్‌ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com