కోర్టు స్నేక్గ్యాంగ్ నేరాలు నిర్ధారించింది...
- May 10, 2016
నగర శివారులో అకృత్యాలకు పాల్పడిన స్నేక్గ్యాంగ్లోని 8 మంది నేరానికి పాల్పడినట్లు రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం నిర్ధారించింది. నిందితులు దోపిడీ, అసభ్య ప్రవర్తనపై ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం నేరం చేసినట్లు నిర్థారించింది.అయితే వీరు అత్యాచారానికి పాల్పడ్డారనడానికి సరైన ఆధారాలు లేవని పేర్కొంది. ఈ కేసులో సరైన ఆధారాలు లేని కారణంగా తొమ్మిదో నిందితుడిపై కేసు కొట్టేసింది. దోషులకు రేపు శిక్ష ఖరారు కానుంది.పహాడీషరీఫ్ పోలీస్ ఠాణా పరిధిలో 2014, జులై 31న స్నేక్గ్యాంగ్ సభ్యులు ఫాంహౌజ్లోకి చొరబడి ఓ యువతిని పాముతో బెదిరించి అత్యాచారానికి పాల్పడటం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు నిందితులపై ఐపీసీ 376డి, 341, 323, 395, 506, 212, 411 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం తొమ్మిది మంది నిందితులపై కోర్టులో పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేశారు. ఫైసల్ దయాని(ఎర్రకుంట), ఖాదర్ బరాక్బ(ఉస్మాన్సాగర్), తయ్యబ్ బసలమ(బండ్లగూడ, బార్కాస్), మహ్మద్ పర్వేజ్(షాయిన్నగర్), అలీ బరాక్బ(షాయిన్నగర్), సలాం హండీ(బిస్మిల్లాకాలనీ)లను నిందితులుగా చూపించారు. వీరిలో ఏడుగురు ప్రస్తుతం చర్లపల్లి కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉండగా... మిగిలిన ఇద్దరు బెయిల్పై బయట ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం







