కోర్టు స్నేక్గ్యాంగ్ నేరాలు నిర్ధారించింది...
- May 10, 2016
నగర శివారులో అకృత్యాలకు పాల్పడిన స్నేక్గ్యాంగ్లోని 8 మంది నేరానికి పాల్పడినట్లు రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం నిర్ధారించింది. నిందితులు దోపిడీ, అసభ్య ప్రవర్తనపై ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం నేరం చేసినట్లు నిర్థారించింది.అయితే వీరు అత్యాచారానికి పాల్పడ్డారనడానికి సరైన ఆధారాలు లేవని పేర్కొంది. ఈ కేసులో సరైన ఆధారాలు లేని కారణంగా తొమ్మిదో నిందితుడిపై కేసు కొట్టేసింది. దోషులకు రేపు శిక్ష ఖరారు కానుంది.పహాడీషరీఫ్ పోలీస్ ఠాణా పరిధిలో 2014, జులై 31న స్నేక్గ్యాంగ్ సభ్యులు ఫాంహౌజ్లోకి చొరబడి ఓ యువతిని పాముతో బెదిరించి అత్యాచారానికి పాల్పడటం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు నిందితులపై ఐపీసీ 376డి, 341, 323, 395, 506, 212, 411 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం తొమ్మిది మంది నిందితులపై కోర్టులో పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేశారు. ఫైసల్ దయాని(ఎర్రకుంట), ఖాదర్ బరాక్బ(ఉస్మాన్సాగర్), తయ్యబ్ బసలమ(బండ్లగూడ, బార్కాస్), మహ్మద్ పర్వేజ్(షాయిన్నగర్), అలీ బరాక్బ(షాయిన్నగర్), సలాం హండీ(బిస్మిల్లాకాలనీ)లను నిందితులుగా చూపించారు. వీరిలో ఏడుగురు ప్రస్తుతం చర్లపల్లి కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉండగా... మిగిలిన ఇద్దరు బెయిల్పై బయట ఉన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









