బహ్రెయిన్లో నలుగురు ఆసియన్లపై విచారణ ప్రారంభం
- May 01, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్లోకి మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ఘటనలో నలుగురు ఆసియన్లను కస్టమ్స్ వ్యవహారాల సహకారంతో యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ పట్టుకుంది. ఈ సందర్భంగా మెయిల్ ప్యాకేజీల ద్వారా మాదక ద్రవ్యాల రవాణా కుట్రను భగ్నం చేసింది. సుమారు BD 100,000 విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయ కస్టమ్స్ అధికారుల నుండి సమాచారం అందుకున్న తరువాత యాంటీ నార్కోటిక్ అధికారులు విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేశారు. ఇటీవల బంగాళదుంపల లోపల డ్రగ్స్ ను పెట్టి అక్రమ రవాణా చేసిన కేసులో ఆరుగురు ఆసియన్లను డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బహ్రెయిన్ లో 2021లో 560 డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు నమోదు కాగా.. 2022లో 830 కేసులు నమోదు అయినట్లు డైరెక్టరేట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!









