బహ్రెయిన్లో నలుగురు ఆసియన్లపై విచారణ ప్రారంభం
- May 01, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్లోకి మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ఘటనలో నలుగురు ఆసియన్లను కస్టమ్స్ వ్యవహారాల సహకారంతో యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ పట్టుకుంది. ఈ సందర్భంగా మెయిల్ ప్యాకేజీల ద్వారా మాదక ద్రవ్యాల రవాణా కుట్రను భగ్నం చేసింది. సుమారు BD 100,000 విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయ కస్టమ్స్ అధికారుల నుండి సమాచారం అందుకున్న తరువాత యాంటీ నార్కోటిక్ అధికారులు విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేశారు. ఇటీవల బంగాళదుంపల లోపల డ్రగ్స్ ను పెట్టి అక్రమ రవాణా చేసిన కేసులో ఆరుగురు ఆసియన్లను డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బహ్రెయిన్ లో 2021లో 560 డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు నమోదు కాగా.. 2022లో 830 కేసులు నమోదు అయినట్లు డైరెక్టరేట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆధునీకరణ పనులు పూర్తి.. కువైట్ ఆరోగ్య కేంద్రం రీ ఓపెన్..!!
- వచ్చే వారం సముద్రం కల్లోలంగా ఉంటుంది: ఖతార్
- మస్కట్లో పీస్ వాక్.. బీచ్ క్లినింగ్ ఈవెంట్..!!
- జూన్ నెలకి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో జూన్ 7నుంచి ఫస్ట్ ఫేజ్ సమ్మర్ హీట్..!
- మక్కా, పవిత్ర స్థలాల్లో 38వేలకుపైగా తనిఖీలు..!!
- ఎబోలా వైరస్ పరిణామాలను పర్యవేక్షిస్తున్నాము: యూఏఈ
- లోక్ భవన్లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- 12 మిలియన్ దిర్హమ్ విలువైన విలాసవంతమైన ఊద్ దొంగతనం..12 గంటల్లో ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీస్
- కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్ హత్య..ఏడుగురు అరెస్ట్









