భారత్ కరోనా అప్డేట్
- May 02, 2023
న్యూఢిల్లీ: భారత దేశంలో గత కొన్ని రోజులుగా 10 వేలకు చేరువలో నమోదైన కేసులు.. ఇప్పుడు 5 వేలకు లోపే వెలుగు చూస్తున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 1,45,309 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,325 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,52,996కి చేరింది.
మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 47,246 నుంచి 44,175కు దిగొచ్చింది. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,43,77,257గా ఉంది. గత 24 గంటల వ్యవధిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,564 కి చేరింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.10 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.72 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,68,613) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
తాజా వార్తలు
- గూగుల్కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!
- డొమెస్టిక్ వర్కర్ చెవి కొరికిన వ్యక్తికి జైలు శిక్ష..!!
- 73 మిలియన్లు దాటిన పేమెంట్స్ సిస్టమ్ లావాదేవీలు..!!
- జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై నిషేధం..!!
- ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రధాని మోదీ సూచనలు
- భారత నూతన సీడీఎస్గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతల స్వీకారం!
- రిటైర్డ్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయం: సైబరాబాద్ సీపీ









