ఫ్లిప్కార్ట్ కొత్త సెంటర్ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
- May 02, 2023
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ సంగారెడ్డిలో ఫ్లిప్కార్ట్ ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ను వర్చువల్ విధానంలో మంగళవారం ఉదయం ప్రారంభించారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో జరిగిన ఈ కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడారు. సంగారెడ్డిలో ఫ్లిప్ కార్ట్ ఫుల్ ఫీల్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు ఆ యాజమాన్యానికి మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి కల్పన లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కామర్స్ రంగం వేగంగా దూసుకుపోతోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తే దేశం అదే ఫాలో అవుతుంది. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక బృందాలు విజయవంతంగా పని చేస్తున్నాయి. ఉపాధి కల్పనలో మహిళలకు 50 శాతం ప్రాధాన్యం ఇవ్వాలి. దేశానికి తెలంగాణను రోల్ మోడల్గా మారుద్దాం అని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఫ్లిప్కార్ట్ సీఈవో కల్యాణ్తో పాటు పలువురు హాజరయ్యారు.
తాజా వార్తలు
- గూగుల్కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!
- డొమెస్టిక్ వర్కర్ చెవి కొరికిన వ్యక్తికి జైలు శిక్ష..!!
- 73 మిలియన్లు దాటిన పేమెంట్స్ సిస్టమ్ లావాదేవీలు..!!
- జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై నిషేధం..!!
- ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రధాని మోదీ సూచనలు
- భారత నూతన సీడీఎస్గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతల స్వీకారం!
- రిటైర్డ్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయం: సైబరాబాద్ సీపీ









