సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 6 మంది తోబుట్టువులు మృతి
- May 03, 2023
రియాద్: తైఫ్ గవర్నరేట్ను అల్-బహా ప్రాంతాలతో కలిపే రహదారి వద్ద ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాదకరమైన కారు ప్రమాదంలో 6 మంది తోబుట్టువుల మరణించడం విషాదాన్ని నింపింది. వారి తల్లిదండ్రులు, ముగ్గురు ఇతర తోబుట్టువుల పరిస్థితి విషమంగా ఉన్నందున వారిని ఇంటెన్సివ్ కేర్కు తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో ఢీకొన్న రెండవ కారును నడుపుతున్న అరవై ఏళ్ల డ్రైవర్ కూడా మరణించాడు. అయితే ఒక 4 ఏళ్ల బాలిక ప్రాణాలతో క్షేమంగా బయటపడటం విశేషం. తన సోదరుడు అహ్మద్ కుటుంబం మదీనా నుండి అల్-బహాకు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం సంభవించిందని మహమ్మద్ సలేం అల్-గమ్ది తెలిపారు. ప్రమాదంలో మరణించిన 6 మంది తోబుట్టువులు రీమా, సేలం, మహమ్మద్, సౌద్, యాహ్యా మరియు హమ్దాన్ అని, వారిలో పెద్దవాడికి 17 సంవత్సరాలు, చిన్నవాడికి 2 సంవత్సరాల వయస్సు ఉందని అతను చెప్పాడు. తైఫ్లోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్, కింగ్ అబ్దుల్ అజీజ్ స్పెషలిస్ట్ హాస్పిటల్, ప్రిన్స్ సుల్తాన్ హాస్పిటల్లో తల్లిదండ్రులు.. ఇద్దరు కుమార్తెలు రెనాద్, మునీరా, ఒక కుమారుడు సుల్తాన్ను ఇంటెన్సివ్ కేర్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







