ఒమన్లో ఇసుక కూలి కార్మికుడు మృతి..3 రోజుల్లో రెండో ఘటన
- May 03, 2023
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో బావి తవ్వుతుండగా ఇసుక కూలడంతో ఓ ఆసియా కార్మికుడు మృతి చెందాడని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) వెల్లడించింది. మూడు రోజుల్లో ఈ తరహా ఘటన ఇది రెండోవది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని అల్ ముంట్రెబ్లోని ఒక పొలం వద్ద బావి తవ్వుతుండగా ఇసుక కూలిన ఘటన చోటుచేసుకుందని సమాచారం అందడంతో.. సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఏప్రిల్ 30న సౌత్ అల్ బతినా గవర్నరేట్లో ఒక సంస్థ నిర్వహణ పనులు చేస్తుండగా ఇసుక కూలిన సంఘటనలో ముగ్గురు కార్మికులు మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







