ఒమన్‌లో ఇసుక కూలి కార్మికుడు మృతి..3 రోజుల్లో రెండో ఘటన

- May 03, 2023 , by Maagulf
ఒమన్‌లో ఇసుక కూలి కార్మికుడు మృతి..3 రోజుల్లో రెండో ఘటన

మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లో బావి తవ్వుతుండగా ఇసుక కూలడంతో ఓ ఆసియా కార్మికుడు మృతి చెందాడని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) వెల్లడించింది. మూడు రోజుల్లో ఈ తరహా ఘటన ఇది రెండోవది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని అల్ ముంట్రెబ్‌లోని ఒక పొలం వద్ద బావి తవ్వుతుండగా ఇసుక కూలిన ఘటన చోటుచేసుకుందని సమాచారం అందడంతో.. సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్‌మెంట్ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఏప్రిల్ 30న సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో ఒక సంస్థ నిర్వహణ పనులు చేస్తుండగా ఇసుక కూలిన సంఘటనలో ముగ్గురు కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com