ప్రముఖ ఆసియా గమ్యస్థానానికి Dh10కే టిక్కెట్
- May 07, 2023
దుబాయ్: ఫిలిప్పీన్స్లోని టాప్ ఎయిర్లైన్స్లో ఒకటైన సెబు పసిఫిక్, కేవలం 10 దిర్హామ్లకే విమాన టిక్కెట్లను అందిస్తోంది. శుక్రవారం జరిగిన క్యారియర్ 10వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అతి తక్కువ విమాన ఛార్జీలను ప్రకటించారు. మే 5 నుండి 9 వరకు, దుబాయ్ నుండి మనీలాకు వెళ్లే ప్రయాణికులు తమ విమానాలను వన్-వే బేస్ ధర Dh10తో బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ వ్యవధి తప్పనిసరిగా జూన్ 1 నుండి నవంబర్ 30, 2023 వరకు ఉండాలి. సెబు పసిఫిక్ – దుబాయ్, మనీలా మధ్య ప్రతిరోజూ రెండుసార్లు ప్రయాణించే మార్గం. యూఏఈ నుండి.. వచ్చే ప్రయాణికులకు తక్కువ ఛార్జీలకే టిక్కెట్లను అందిస్తోంది. దీని టిక్కెట్ ధరలు ఇతర విమానయాన సంస్థల కంటే 54 శాతం వరకు తక్కువగా ఉంటాయి. విదేశీ ఫిలిపినోలు, పర్యాటకులకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురానుందని ఎయిర్లైన్ చీఫ్ మార్కెటింగ్, కస్టమర్ విభాగం హెడ్ కాండిస్ ఐయోగ్ తెలిపారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







