ప్రముఖ ఆసియా గమ్యస్థానానికి Dh10కే టిక్కెట్
- May 07, 2023
దుబాయ్: ఫిలిప్పీన్స్లోని టాప్ ఎయిర్లైన్స్లో ఒకటైన సెబు పసిఫిక్, కేవలం 10 దిర్హామ్లకే విమాన టిక్కెట్లను అందిస్తోంది. శుక్రవారం జరిగిన క్యారియర్ 10వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అతి తక్కువ విమాన ఛార్జీలను ప్రకటించారు. మే 5 నుండి 9 వరకు, దుబాయ్ నుండి మనీలాకు వెళ్లే ప్రయాణికులు తమ విమానాలను వన్-వే బేస్ ధర Dh10తో బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ వ్యవధి తప్పనిసరిగా జూన్ 1 నుండి నవంబర్ 30, 2023 వరకు ఉండాలి. సెబు పసిఫిక్ – దుబాయ్, మనీలా మధ్య ప్రతిరోజూ రెండుసార్లు ప్రయాణించే మార్గం. యూఏఈ నుండి.. వచ్చే ప్రయాణికులకు తక్కువ ఛార్జీలకే టిక్కెట్లను అందిస్తోంది. దీని టిక్కెట్ ధరలు ఇతర విమానయాన సంస్థల కంటే 54 శాతం వరకు తక్కువగా ఉంటాయి. విదేశీ ఫిలిపినోలు, పర్యాటకులకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురానుందని ఎయిర్లైన్ చీఫ్ మార్కెటింగ్, కస్టమర్ విభాగం హెడ్ కాండిస్ ఐయోగ్ తెలిపారు.
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







