నా చివరి శ్వాస ఈ దేశానికే సొంతం
- May 10, 2016
అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ సోనియాగాంధీకి ఇటలీతో సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన విమర్శలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి దీటుగా బదులిచ్చారు. 'నా నిజాయితీని సవాల్ చేస్తూ మోదీ ఎంతకైనా దిగజారొచ్చు. కానీ, భారత్ పట్ల నాకు చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నాయన్న సత్యాన్ని ఆయన ఏనాడూ మరుగుపరుచలేరు' అని సోనియా పేర్కొన్నారు.తిరువనంతపురంలో మంగళవారం జరిగిన ఎన్నికల సభలో ఆమె ప్రసంగిస్తూ. 'ఔను, నేను ఇటలీలోనే పుట్టాను. 1968లో ఇందిరాగాంధీ కోడలిగా నేను భారత్లో అడుగుపెట్టాను. 48 ఏళ్లు నేను భారత్లోనే గడిపాను. ఇది నా ఇల్లు. ఇది నా దేశం. ఈ 48 ఏళ్ల కాలమంతా బీజేపీ, ఆరెస్సెస్, ఇతర పార్టీలు పుట్టుక విషయమై నన్ను విమర్శిస్తూ సిగ్గుపడేలా చేద్దామనుకుంటున్నారు. నిజాయితీపరులైన తల్లిదండ్రులకు నేను పుట్టానని గర్వంగా చెప్తాను. వారి గురించి నేనెప్పుడూ సిగ్గుపడను. ఔను, నాకు ఇటలీలో బంధువులు ఉన్నారు. 93 ఏళ్ల నా తల్లి, ఇద్దరు చెల్లెళ్లు అక్కడే ఉన్నారు' అని సోనియా పేర్కొన్నారు.
'ఇక్కడే, ఈ గడ్డమీదనే నేను తుదిశ్వాస వదులుతాను. ఇక్కడే నా ఆస్తికలు నా ఆప్తులతో కలిసిపోతాయి. ఈ ఆత్మీయ భావనను ప్రధాని అర్థం చేసుకుంటారని నేను భావించను. కానీ మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తాను' అని సోనియా భావోద్వేగంగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







