ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ 'శత జయంతి ఉత్సవాలు'
- May 10, 2023
దోహా: ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌమ కి.శే. నందమూరి తారక రామారావు "శత జయంతి ఉత్సవాలు" మే 5వ తారీఖున శుక్రవారం దోహా లో LA Cigale హోటల్ లోని అల్ వాజ్బా బాల్రూమ్ లో (ఖతార్) అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి తారక రామారావు నట వారసుడు, హిందూపురం శాసనసభ్యులు, నట సింహం నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ నేపధ్య గాయనీ గాయకులు సింహ భాగవతుల, ప్రవీణ్ కుమార్ కొప్పోలు, గాయని పర్ణిక మాన్య హాజరయ్యారు. ఖతార్ లోని భారత రాయబార సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అత్యున్నత సంస్థల (ICC, ISC ICBF, IBPN) అధ్యక్షులు, వారి ప్రతినిధులు, ఖతార్ లోని తెలుగు ప్రముఖులు మరియు వివిధ తెలుగు సంఘాల (TKS, TPS, TGS, TJQ, TBA) అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖతార్ లోని నలుమూలల నుండి 1200 మందికి పైగా హాజరయ్యారు.
బాలబాలికల సంప్రదాయ నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాల్ని మొదలుపెట్టగా గాయనీ గాయకులు సింహ, ప్రవీణ్ మరియు పర్ణిక NTR మరియు బాలకృష్ణ గారి పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. బాలయ్య బాబు తన తండ్రి (ఎన్టీఆర్) గారి గూర్చిన అద్భుత ప్రసంగమే కాకుండా "శివశంకరీ శివానందలహరి" పాటను పాడి ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నారు. బాలయ్య పాటకు ప్రేక్షకులందరూ ఫిదా అయ్యి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అలాగే హర్షధ్వానాలతో "జై బాలయ్య" నినాదాలతో హాలంతా మార్మోగింది. అయన లైవ్ లో పాడిన పాట ఇప్పటికీ నెట్లో వైరల్ గా మరి హల్ చల్ చేస్తోంది.
ఆంధ్ర కళావేదిక అధ్యక్షుడు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ కేవలం వారం రోజుల సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం "న భూతొ న భవిష్యత్" అనే విధంగా ఖతార్ లోని తెలుగు సంఘాలలో చరిత్ర సృష్టించిందని, ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ విజయవంతంగా నిర్వహించుకోటానికి అవకాశం కల్పించి సహకరించిన గొట్టిపాటి రమణయ్య , ప్రాయోజితులు(స్పాన్సర్స్)కి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అంతే కాక కార్యక్రమ నిర్వహణ ప్రోత్సాహక కమిటీ సభ్యులు అయిన గోపాల్ , వాసు , రమేష్ , విక్రమ్ సుఖవాసి కి, స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్) గా సహకరించిన వారికీ ప్రత్యేకంగా గోవర్ధన్ అమూరు కు, కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు, వారి తల్లితండ్రులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అద్భుతమైన మీడియా సహకారాన్ని అందిస్తున్న మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ సభ్యులు గొట్టిపాటి రమణ, విక్రమ్ సుఖవాసి, వీబీకే మూర్తి, శ్రీ సుధ, శిరీష రామ్, రవీంద్ర, శేఖరం రావు, సాయి రమేష్, KT రావు బృందం చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు మరియు హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు. ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశ ధన్యవాదాలు తో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)




తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







