ఏడాదిలో భారత్ చేరిన 1,100 మంది ఒమన్ బాధితులు..!

- May 11, 2023 , by Maagulf
ఏడాదిలో భారత్ చేరిన 1,100 మంది ఒమన్ బాధితులు..!

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం.. గత ఏడాది కాలంగా 1,100 మందికి పైగా ఒమన్ లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లారు. వీరిలో కార్మికులు, మహిళా గృహ కార్మికులు ఉన్నారు. ఈ వివరాలను ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో బుధవారం వెల్లడించింది. ఈ ప్రయత్నంలో "అద్భుతమైన సహకారం" అందించినందుకు సుల్తానేట్‌లోని భారత రాయబార కార్యాలయం ఒమన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తాజాగా 15 మంది మహిళా కార్మికుల బృందం స్వదేశానికి తిరిగి వెళ్లిందని భారత ఎంబసీ ప్రకటించింది. ఒమన్ లో చిక్కుకుపోయిన భారతీయ పౌరుల భద్రత, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. అవసరమైన వారికి సహాయం చేయడానికి, వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగి పంపించడానికి చర్యలు తీసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com