ఏడాదిలో భారత్ చేరిన 1,100 మంది ఒమన్ బాధితులు..!
- May 11, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం.. గత ఏడాది కాలంగా 1,100 మందికి పైగా ఒమన్ లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లారు. వీరిలో కార్మికులు, మహిళా గృహ కార్మికులు ఉన్నారు. ఈ వివరాలను ఒమన్లోని భారత రాయబార కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో బుధవారం వెల్లడించింది. ఈ ప్రయత్నంలో "అద్భుతమైన సహకారం" అందించినందుకు సుల్తానేట్లోని భారత రాయబార కార్యాలయం ఒమన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తాజాగా 15 మంది మహిళా కార్మికుల బృందం స్వదేశానికి తిరిగి వెళ్లిందని భారత ఎంబసీ ప్రకటించింది. ఒమన్ లో చిక్కుకుపోయిన భారతీయ పౌరుల భద్రత, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. అవసరమైన వారికి సహాయం చేయడానికి, వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగి పంపించడానికి చర్యలు తీసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









