ఏడాదిలో భారత్ చేరిన 1,100 మంది ఒమన్ బాధితులు..!
- May 11, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం.. గత ఏడాది కాలంగా 1,100 మందికి పైగా ఒమన్ లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లారు. వీరిలో కార్మికులు, మహిళా గృహ కార్మికులు ఉన్నారు. ఈ వివరాలను ఒమన్లోని భారత రాయబార కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో బుధవారం వెల్లడించింది. ఈ ప్రయత్నంలో "అద్భుతమైన సహకారం" అందించినందుకు సుల్తానేట్లోని భారత రాయబార కార్యాలయం ఒమన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తాజాగా 15 మంది మహిళా కార్మికుల బృందం స్వదేశానికి తిరిగి వెళ్లిందని భారత ఎంబసీ ప్రకటించింది. ఒమన్ లో చిక్కుకుపోయిన భారతీయ పౌరుల భద్రత, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. అవసరమైన వారికి సహాయం చేయడానికి, వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగి పంపించడానికి చర్యలు తీసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







