ఏడాదిలో భారత్ చేరిన 1,100 మంది ఒమన్ బాధితులు..!
- May 11, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం.. గత ఏడాది కాలంగా 1,100 మందికి పైగా ఒమన్ లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లారు. వీరిలో కార్మికులు, మహిళా గృహ కార్మికులు ఉన్నారు. ఈ వివరాలను ఒమన్లోని భారత రాయబార కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో బుధవారం వెల్లడించింది. ఈ ప్రయత్నంలో "అద్భుతమైన సహకారం" అందించినందుకు సుల్తానేట్లోని భారత రాయబార కార్యాలయం ఒమన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తాజాగా 15 మంది మహిళా కార్మికుల బృందం స్వదేశానికి తిరిగి వెళ్లిందని భారత ఎంబసీ ప్రకటించింది. ఒమన్ లో చిక్కుకుపోయిన భారతీయ పౌరుల భద్రత, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. అవసరమైన వారికి సహాయం చేయడానికి, వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగి పంపించడానికి చర్యలు తీసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







