ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక యాప్..
- May 10, 2016
ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక యాప్ను సిద్ధం చేసింది. ఈ యాప్ ద్వారా బస్ టికెట్లను బుక్ చేసుకోవడం, రద్దు చేసుకోవడం.. జీపీఎస్ ఆధారంగా బస్సు జాడ తెలుసుకోవడం, ఇంకా 'ఎం-వాలెట్' తదితర సౌకర్యాలు అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ యాప్తో పాటు విజయవాడలో ఆర్టీసీ ప్రధాన కార్యాలయాన్ని, సిటీ బస్టెర్మినల్ను సీఎం చంద్రబాబుతో నెలాఖరులోపు ప్రారంభించాలని సంస్థ నిర్ణయించింది.బహుళ ప్రయోజనాలు... ఆర్టీసీ యాప్లోని ఎం-వాలెట్లో డబ్బులు డిపాజిట్ చేసుకుని.. ఆ సొమ్ముతో టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులకు రూ.100 రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. ఒక్కో ప్రయాణానికి రూ.50 చొప్పున రెండు ప్రయాణాలకు ఈ రాయితీ ఇవ్వనుంది. బ్యాంకు ఖాతా నుంచి ఆర్టీసీ ఎం-వాలెట్లోకి డబ్బులు పంపినప్పుడు ఖాతాదారుపై బ్యాంకు విధించే సర్వీసు ఛార్జీని సంస్థే భరించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఏదైనా కారణం వల్ల ఈ-టికెట్ రద్దు చేసుకున్నప్పుడు.. ప్రయాణ సమయాన్ని బట్టి రద్దు ఛార్జీలు పెరుగుతుంటాయి. 48 గంటల ముందు రద్దు చేసుకుంటే.. రిజర్వేషన్, సర్వీసు ఛార్జీలు మినహాయించి మిగిలిన టికెట్ అసలు ధరను పూర్తిగా ఇస్తారు. యాప్ ద్వారా టికెట్ రద్దు చేసుకునే ప్రయాణికులకు సేవా రుసుములు మినహాయించకుండా పూర్తి మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







