అల్ దఖిలియాలో పర్యావరణ కాలుష్యంపై స్పందించిన అథారిటీ

- May 15, 2023 , by Maagulf
అల్ దఖిలియాలో పర్యావరణ కాలుష్యంపై స్పందించిన అథారిటీ

మస్కట్ : అల్ దఖిలియా గవర్నరేట్‌లో పర్యావరణ కాలుష్యానికి సంబంధించి ఎన్విరాన్‌మెంట్ అథారిటీ (EA) కీలక చర్యలు చేపట్టనుంది. ఈ సమస్యకు సంబంధించి సోమవారం ముఖ్యమైన సమావేశం నిర్వహించనుంది. అల్ దఖిలియా గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ సమైల్‌లో మర్దామ్ హసాస్‌లో పర్యావరణ కాలుష్యం గురించి వార్తా పత్రికలలో వచ్చిన కథనాలపై అథారిటీ తన ట్విట్టర్‌లో అధికారిక ఖాతాలో స్పందించింది. అథారిటీ గతంలో చేపట్టిన విధానాలను పూర్తి చేయడానికి, పర్యావరణ అథారిటీ ఛైర్మన్ హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ అబ్దుల్లా బిన్ అలీ అల్ అమ్రీ.. పలు ప్రభుత్వ సంస్థల అధికారులు, నిపుణులతో కలిసి ఆయా ప్రాంతాలను సందర్శించారు. ఈ పర్యటనలో బాధ్యులైన పార్టీలపై పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించిన నోటీసులను జారీ చేయడంతో పాటు నిర్ధిష్ట వ్యవధిలో పరిస్థితిని సరిదిద్దడానికి వారిని నిర్బంధించడంతో సహా అనేక చర్యలు తీసుకున్నట్లు అథారిటీ ధృవీకరించింది. దీంతో పాటు పర్యావరణ పరిశుభ్రత అమలు, ప్రమాదకర రసాయన పదార్థాలను సరైన మార్గాల్లో సరైన మార్గాల్లో పారవేయడం కోసం ప్రణాళికను రూపొందించాలని అథారిటీ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com