అల్ దఖిలియాలో పర్యావరణ కాలుష్యంపై స్పందించిన అథారిటీ
- May 15, 2023
మస్కట్ : అల్ దఖిలియా గవర్నరేట్లో పర్యావరణ కాలుష్యానికి సంబంధించి ఎన్విరాన్మెంట్ అథారిటీ (EA) కీలక చర్యలు చేపట్టనుంది. ఈ సమస్యకు సంబంధించి సోమవారం ముఖ్యమైన సమావేశం నిర్వహించనుంది. అల్ దఖిలియా గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ సమైల్లో మర్దామ్ హసాస్లో పర్యావరణ కాలుష్యం గురించి వార్తా పత్రికలలో వచ్చిన కథనాలపై అథారిటీ తన ట్విట్టర్లో అధికారిక ఖాతాలో స్పందించింది. అథారిటీ గతంలో చేపట్టిన విధానాలను పూర్తి చేయడానికి, పర్యావరణ అథారిటీ ఛైర్మన్ హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ అబ్దుల్లా బిన్ అలీ అల్ అమ్రీ.. పలు ప్రభుత్వ సంస్థల అధికారులు, నిపుణులతో కలిసి ఆయా ప్రాంతాలను సందర్శించారు. ఈ పర్యటనలో బాధ్యులైన పార్టీలపై పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించిన నోటీసులను జారీ చేయడంతో పాటు నిర్ధిష్ట వ్యవధిలో పరిస్థితిని సరిదిద్దడానికి వారిని నిర్బంధించడంతో సహా అనేక చర్యలు తీసుకున్నట్లు అథారిటీ ధృవీకరించింది. దీంతో పాటు పర్యావరణ పరిశుభ్రత అమలు, ప్రమాదకర రసాయన పదార్థాలను సరైన మార్గాల్లో సరైన మార్గాల్లో పారవేయడం కోసం ప్రణాళికను రూపొందించాలని అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







