అల్ దఖిలియాలో పర్యావరణ కాలుష్యంపై స్పందించిన అథారిటీ
- May 15, 2023
మస్కట్ : అల్ దఖిలియా గవర్నరేట్లో పర్యావరణ కాలుష్యానికి సంబంధించి ఎన్విరాన్మెంట్ అథారిటీ (EA) కీలక చర్యలు చేపట్టనుంది. ఈ సమస్యకు సంబంధించి సోమవారం ముఖ్యమైన సమావేశం నిర్వహించనుంది. అల్ దఖిలియా గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ సమైల్లో మర్దామ్ హసాస్లో పర్యావరణ కాలుష్యం గురించి వార్తా పత్రికలలో వచ్చిన కథనాలపై అథారిటీ తన ట్విట్టర్లో అధికారిక ఖాతాలో స్పందించింది. అథారిటీ గతంలో చేపట్టిన విధానాలను పూర్తి చేయడానికి, పర్యావరణ అథారిటీ ఛైర్మన్ హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ అబ్దుల్లా బిన్ అలీ అల్ అమ్రీ.. పలు ప్రభుత్వ సంస్థల అధికారులు, నిపుణులతో కలిసి ఆయా ప్రాంతాలను సందర్శించారు. ఈ పర్యటనలో బాధ్యులైన పార్టీలపై పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించిన నోటీసులను జారీ చేయడంతో పాటు నిర్ధిష్ట వ్యవధిలో పరిస్థితిని సరిదిద్దడానికి వారిని నిర్బంధించడంతో సహా అనేక చర్యలు తీసుకున్నట్లు అథారిటీ ధృవీకరించింది. దీంతో పాటు పర్యావరణ పరిశుభ్రత అమలు, ప్రమాదకర రసాయన పదార్థాలను సరైన మార్గాల్లో సరైన మార్గాల్లో పారవేయడం కోసం ప్రణాళికను రూపొందించాలని అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







