అల్ దఖిలియాలో పర్యావరణ కాలుష్యంపై స్పందించిన అథారిటీ
- May 15, 2023
మస్కట్ : అల్ దఖిలియా గవర్నరేట్లో పర్యావరణ కాలుష్యానికి సంబంధించి ఎన్విరాన్మెంట్ అథారిటీ (EA) కీలక చర్యలు చేపట్టనుంది. ఈ సమస్యకు సంబంధించి సోమవారం ముఖ్యమైన సమావేశం నిర్వహించనుంది. అల్ దఖిలియా గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ సమైల్లో మర్దామ్ హసాస్లో పర్యావరణ కాలుష్యం గురించి వార్తా పత్రికలలో వచ్చిన కథనాలపై అథారిటీ తన ట్విట్టర్లో అధికారిక ఖాతాలో స్పందించింది. అథారిటీ గతంలో చేపట్టిన విధానాలను పూర్తి చేయడానికి, పర్యావరణ అథారిటీ ఛైర్మన్ హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ అబ్దుల్లా బిన్ అలీ అల్ అమ్రీ.. పలు ప్రభుత్వ సంస్థల అధికారులు, నిపుణులతో కలిసి ఆయా ప్రాంతాలను సందర్శించారు. ఈ పర్యటనలో బాధ్యులైన పార్టీలపై పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించిన నోటీసులను జారీ చేయడంతో పాటు నిర్ధిష్ట వ్యవధిలో పరిస్థితిని సరిదిద్దడానికి వారిని నిర్బంధించడంతో సహా అనేక చర్యలు తీసుకున్నట్లు అథారిటీ ధృవీకరించింది. దీంతో పాటు పర్యావరణ పరిశుభ్రత అమలు, ప్రమాదకర రసాయన పదార్థాలను సరైన మార్గాల్లో సరైన మార్గాల్లో పారవేయడం కోసం ప్రణాళికను రూపొందించాలని అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









