యూఏఈ లో 47°C దాటిన ఉష్ణోగ్రతలు.. రెండు రోజుల్లో వర్షాలు?
- May 16, 2023
యూఏఈ: గత కొన్ని రోజులుగా యూఏఈలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే 14న అల్ దఫ్రాలో అత్యధికంగా 46°C నమోదుకాగా.. అంతకుముందు రోజు అల్ ఘేవీఫాత్లో 47.1°C ఉష్ణోగ్రత నమోదైంది. మే 15న కల్బాలో 44.6°C నమోదయింది. వేసవికి ముందు ఉష్ణోగ్రతల నుండి నివాసితులు కొంత ఉపశమనం పొందుతారని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) నుండి డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వారం చివరిలో దేశంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కూడా పడతాయని చెప్పారు. దీంతో 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందన్నారు. అరేబియా గల్ఫ్లో సముద్రం మధ్యస్థం నుండి కొంత అల్లకల్లోలంగా ఉంటుందని, ఒమన్ సముద్రంలో మధ్యస్థంగా ఉంటుందని ఎన్సీఎం ప్రకటించింది. తీరప్రాంతాలలో తేమగా ఉంటుందని, కొన్ని పశ్చిమ ప్రాంతాలలో పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







