సౌదీలో ఏపీ యువకుడి కథ సుఖాంతం
- May 18, 2023
ఏపీ: ఇండియాలో సాధారణంగా వాడే ట్రామాడోల్ (Tramadol) ట్యాబ్లెట్స్ ను తెలియక సౌదీలో వాడుతూ.. అధికారులకు దొరికి నానా ఇబ్బందులు పడ్డ శ్రీకాకుళం జిల్లా ఎత్చెర్ల మండలానికి చెందిన వాసుపల్లి రాంబాబు(25) కథ సుఖాంతమైంది.
వివరాల్లోకి వెళితే.. సౌదీ అరేబియాలోని ఒక నౌకయాన సంస్ధలో వాసుపల్లి రాంబాబు పనిచేస్తున్నాడు. గతేడాది నవంబర్ లో ఎర్ర సముద్ర తీరంలో తాను పని చేస్తున్న నౌక నుండి విధులు ముగించుకొని వస్తుంగా.. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో రాంబాబు బ్యాగులో ట్రామాడోల్ ట్యాబ్లెట్స్ దొరికాయి. అయితే, సౌదీలో వాటిని వినియోగించడం చట్టరీత్యా నేరం. అవి మాదకద్రవ్యాల కేటగిరీలో ఉన్నాయి. దీంతో అతడిని సౌదీ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
సముద్రయానంలో తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటే... ఇండియాకు వెళ్లిన సమయంలో వైద్యులకు చూపించగా ట్రామాడోల్ ట్యాబ్లెట్స్ను వాడమని రాసిచ్చారని చెప్పాడు. కానీ రాంబాబు ఎంత చెప్పినా అక్కడి అధికారులు పట్టించుకోకుండా జైలుకు పంపారు. కేసు పూర్తయ్యే వరకు సౌదీ విడిచి వెళ్ళకుండా అతనిపై ట్రావెల్ బ్యాన్ విధించారు.
నెలలు గడుస్తున్న ఈ కేసులో ఏలాంటి పురోగతి లేకపోవడంతో బాధితుడి రాంబాబు తల్లి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ద్వారా ఎపీఎన్నార్టీ కో-ఆర్డినేటర్, తెలుగు కళా క్షేత్రం అధ్యక్షుడు రెవెల్ అంటోనీని సంప్రదించారు. ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించి రాంబాబు పై ఉన్న ట్రావెల్ బ్యాన్ ను తొలగించారు. దీంతో ఎట్టకేలకు రాంబాబు సోమవారం స్వస్ధలానికి చేరుకున్నాడు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









