సౌదీలో ఏపీ యువకుడి కథ సుఖాంతం
- May 18, 2023
ఏపీ: ఇండియాలో సాధారణంగా వాడే ట్రామాడోల్ (Tramadol) ట్యాబ్లెట్స్ ను తెలియక సౌదీలో వాడుతూ.. అధికారులకు దొరికి నానా ఇబ్బందులు పడ్డ శ్రీకాకుళం జిల్లా ఎత్చెర్ల మండలానికి చెందిన వాసుపల్లి రాంబాబు(25) కథ సుఖాంతమైంది.
వివరాల్లోకి వెళితే.. సౌదీ అరేబియాలోని ఒక నౌకయాన సంస్ధలో వాసుపల్లి రాంబాబు పనిచేస్తున్నాడు. గతేడాది నవంబర్ లో ఎర్ర సముద్ర తీరంలో తాను పని చేస్తున్న నౌక నుండి విధులు ముగించుకొని వస్తుంగా.. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో రాంబాబు బ్యాగులో ట్రామాడోల్ ట్యాబ్లెట్స్ దొరికాయి. అయితే, సౌదీలో వాటిని వినియోగించడం చట్టరీత్యా నేరం. అవి మాదకద్రవ్యాల కేటగిరీలో ఉన్నాయి. దీంతో అతడిని సౌదీ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
సముద్రయానంలో తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటే... ఇండియాకు వెళ్లిన సమయంలో వైద్యులకు చూపించగా ట్రామాడోల్ ట్యాబ్లెట్స్ను వాడమని రాసిచ్చారని చెప్పాడు. కానీ రాంబాబు ఎంత చెప్పినా అక్కడి అధికారులు పట్టించుకోకుండా జైలుకు పంపారు. కేసు పూర్తయ్యే వరకు సౌదీ విడిచి వెళ్ళకుండా అతనిపై ట్రావెల్ బ్యాన్ విధించారు.
నెలలు గడుస్తున్న ఈ కేసులో ఏలాంటి పురోగతి లేకపోవడంతో బాధితుడి రాంబాబు తల్లి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ద్వారా ఎపీఎన్నార్టీ కో-ఆర్డినేటర్, తెలుగు కళా క్షేత్రం అధ్యక్షుడు రెవెల్ అంటోనీని సంప్రదించారు. ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించి రాంబాబు పై ఉన్న ట్రావెల్ బ్యాన్ ను తొలగించారు. దీంతో ఎట్టకేలకు రాంబాబు సోమవారం స్వస్ధలానికి చేరుకున్నాడు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







