మూడు రోజుల పాటు అన్ని మ్యూజియాల్లోకి ఉచిత ప్రవేశం
- May 18, 2023
ఖతార్: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఖతార్లోని అన్ని మ్యూజియంలు ఈ రోజు(మే 18) నుండి శనివారం(మే 20) వరకు మూడు రోజుల పాటు ప్రజలకు ఉచితంగా ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు ఖతార్ మ్యూజియమ్స్ (QM) ప్రకటించింది. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఈ సంవత్సరం ‘‘మ్యూజియంలు, సుస్థిరత, శ్రేయస్సు, సమాజాల శ్రేయస్సు, స్థిరమైన అభివృద్ధి, వాతావరణ చర్యలు, సామాజిక పోరాటం, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో మ్యూజియంలు పోషించే కీలక పాత్ర’’ అనే థీమ్ లతో జరుపుకుంటుంది. ఈ సందర్భంగా విద్యా కార్యక్రమాలు, ప్రదర్శనలు, కమ్యూనిటీ ఔట్రీచ్ లను ఏర్పాటు చేయనుందని ఖతార్ మ్యూజియమ్స్ సీఈఓ అహ్మద్ మూసా అల్ నమ్లా చెప్పారు. ఈ రోజు మన భాగస్వామ్య సాంస్కృతిక వారసత్వాన్ని రాబోయే తరాలకు ప్రోత్సహించడం, సంరక్షించడం మన బాధ్యతను గుర్తు చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







