భారతీయులే సంపన్నులు!
- May 11, 2016
గత పదేళ్లలో భారతీయుల సగటు సంపద 400 శాతం పెరిగిందంట. దీంతో భారతీయులు ధనికులుగా మారారని న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్టు నివేదించింది. యూరోపియన్ పౌరుల సంపద 5శాతం పడిపోయిందట. అభివృద్ధి చెందుతున్న దేశాలు భారత్, చైనా, వియత్నాంల సగటు సంపద 2005-15 మధ్య కాలంలో 400 శాతం పెరిగిందని రిపోర్టు వెల్లడించింది. యూరోపియన్ పౌరుల కనీస సంపద కేవలం 86 వేల డాలర్లేనని తెలిపింది.
ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే యూరోపియన్ల పరిస్థితి చాలా పేలవంగా ఉందని, ఆస్ట్రేలియా సగటు సంపదను 100 శాతం పెంచుకుంటే, కెనడా 50 శాతం పెంచుకుందని పేర్కొంది. 2008లో ఏర్పడిన అంతర్జాతీయ ఆర్థికమాంద్య ప్రభావం యూరోపియన్ పౌరుల సంపదపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని వెల్లడించింది. ఆదాయపు పన్ను రేట్లు పెరగడం, ఉద్యోగాలు కోల్పోవడం, తయారీ పరిశ్రమ కుంటిపడటం, కొన్ని దేశాలు పెన్షన్ బాధ్యతలను మోయలేక దివాలా తీయడం వంటివి యూరోపియన్ పౌరుల సంపదకు గండికొట్టాయని రిపోర్టు నివేదించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







