ఇస్లామిక్‌స్టేట్‌ ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి

- May 11, 2016 , by Maagulf
ఇస్లామిక్‌స్టేట్‌ ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి

 ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌స్టేట్‌ ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ఇన్నాళ్లు సామాన్యపౌరులు, ప్రభుత్వదళాలపై ఉగ్రదాడులు జరిపిన ఆ సంస్థ తాజాగా తమ సంస్థకు చెందిన ఉగ్రవాదులను బతికుండగానే సమాధి చేసింది. ఇరాక్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌ ఆధీనంలో వున్న మోసూల్‌ నగరానికి కొన్ని మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. కిర్కుక్‌ ప్రాంతంలో కుర్ధుల దళాలతో పోరాడుతూ 45 మంది ఉగ్రవాదులు పారిపోయారు. దీంతో ఆగ్రహించిన ఇస్లామిక్‌స్టేట్‌ నాయకత్వం వీరిని బతికుండగానే పూడ్చిపెట్టాలని ఆదేశించింది. దీంతో వీరు ప్రాణాలతో వుండగానే గుంత తవ్వి పూడ్చేశారు. రెండు రోజుల క్రితం సిరియాలోని అల్‌రకాలో ఒక స్వలింగ సంపర్కుడిని భవనంపై నుంచి కిందకు తోసి చంపివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com