ఇస్లామిక్స్టేట్ ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి
- May 11, 2016
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్స్టేట్ ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ఇన్నాళ్లు సామాన్యపౌరులు, ప్రభుత్వదళాలపై ఉగ్రదాడులు జరిపిన ఆ సంస్థ తాజాగా తమ సంస్థకు చెందిన ఉగ్రవాదులను బతికుండగానే సమాధి చేసింది. ఇరాక్లోని ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో వున్న మోసూల్ నగరానికి కొన్ని మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. కిర్కుక్ ప్రాంతంలో కుర్ధుల దళాలతో పోరాడుతూ 45 మంది ఉగ్రవాదులు పారిపోయారు. దీంతో ఆగ్రహించిన ఇస్లామిక్స్టేట్ నాయకత్వం వీరిని బతికుండగానే పూడ్చిపెట్టాలని ఆదేశించింది. దీంతో వీరు ప్రాణాలతో వుండగానే గుంత తవ్వి పూడ్చేశారు. రెండు రోజుల క్రితం సిరియాలోని అల్రకాలో ఒక స్వలింగ సంపర్కుడిని భవనంపై నుంచి కిందకు తోసి చంపివేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







