ఫిలిపినోలపై కొనసాగుతున్న నిషేధం
- May 25, 2023
కువైట్: కువైట్ సార్వభౌమాధికారం లేదా కువైట్ పౌరుల గౌరవానికి భంగం కలిగించే ఏ విధమైన ఉల్లంఘనైన సహించేది లేదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. కార్మికుల ఉల్లంఘనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి ఉద్దేశించిన కువైట్ షరతులను మనీలా తిరస్కరించినందున, ఫిలిప్పీన్స్ పౌరులకు ఎలాంటి వీసాల జారీని చేపట్టడం లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది. "మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి , రక్షణ మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబాహ్ సూచనల మేరకు కువైట్ ఇతర దేశాలతో ఒప్పందాల ద్వారా తన లేబర్ మార్కెట్కు అవసరమైన నైపుణ్యాలు, నైపుణ్యాన్ని అవుట్సోర్స్ చేయడానికి కృషి చేస్తోంది.’’ అని పేర్కొంది.
ఫిలిప్పీన్స్ ప్రభుత్వం నుండి వచ్చిన అభ్యర్థన మేరకు, ఫిలిప్పీన్స్ కోసం వీసాల సమస్యపై దర్యాప్తు చేయడానికి ఒక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించబడిందని, ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం కార్మిక ఒప్పందాలను ఉల్లంఘించడం, ఫిలిప్పీన్స్ కార్మికుల చట్టవిరుద్ధమైన పద్ధతులు, నేరాల విషయంలో స్పష్టత రానందున వీసాల జారీని తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిలిపివేస్తునట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్







