1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!

- April 29, 2026 , by Maagulf
1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం రూ.1,000 కోట్ల నిధులను విడుదల చేసింది. 2025 అక్టోబర్ వరకు పేరుకుపోయిన అన్ని బకాయిలను ఒకేసారి క్లియర్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై ఇటీవల గౌరవ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులను కేటాయించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కలగనుంది.

చెల్లింపుల పరిమితి పెంపు
భవిష్యత్తులో ఉద్యోగుల క్లెయిమ్‌లు, బిల్లులు పెండింగ్‌లో ఉండకుండా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా చేసే చెల్లింపుల పరిమితిని అదనంగా మరో రూ. 1,000 కోట్లకు పెంచుతూ ఆర్థిక శాఖ నిర్ణయించింది. దీనివల్ల ఇకపై రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులు, ఇతర క్లెయిమ్‌లు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఉద్యోగ విరమణ చేసిన వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తాజా చర్యలతో బిల్లుల చెల్లింపు ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com