కారు బాంబు పేలుళ్లలో 86 మంది మృతి : బాగ్దాద్

- May 11, 2016 , by Maagulf
కారు బాంబు పేలుళ్లలో 86 మంది మృతి : బాగ్దాద్

కారు బాంబు పేలుళ్లలో 86 మంది మృతి బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో బుధవారం వేర్వేరు చోట్ల జరిగిన మూడు కారు బాంబు పేలుళ్లలో 86 మంది మృతిచెందారు. షీటే ప్రాంతంలో ఉదయం 10 గంటలకు ఓ మార్కెట్ సమీపంలో బాంబు పేలడంతో 64 మంది పౌరులు మరణించగా, మరో 82 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది బాగ్దాద్‌లో చోటుచేసుకున్న దాడుల్లో ఇదే అతి పెద్ద దాడి. పేలుడు ధాటికి మార్కెట్‌లోని షాపులు, వాహనాలు కాలి బూడిదయ్యాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలి దద్దరిల్లింది. ఖదీమియాలో జరిగిన పేలుడులో 14 మంది బలయ్యారు. పశ్చిమ బాగ్దాద్‌లోని జామీమియా లో చోటుచేసుకున్న మరో కారుబాంబు పేలుడులో 8 మంది చనిపోయారు. తామే ఈ దాడులకు పాల్పడినట్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com