తప్పిపోయిన నెల తర్వాత పౌరుడి మృతదేహం లభ్యం..!
- May 27, 2023
కువైట్: ఏప్రిల్ మధ్యలో అదృశ్యమైన కువైట్ పౌరుడు ముబారక్ అల్-రషీది మృతదేహం పశ్చిమ అల్-సల్మీ ప్రాంతంలో లభ్యమైనట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ శుక్రవారం సాయంత్రం తెలిపింది. మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రక్షణ మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-అహ్మద్ అల్-సబాహ్ సూచనల మేరకు.. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అల్-రషీది గాలింపును చేపట్టింది. ప్రజా భద్రత, ట్రాఫిక్, సెంట్రల్ ఆపరేషన్స్, పెట్రోలింగ్ మరియు హెలికాప్టర్ల విభాగాలతో సహా వందలాది మంది భద్రతా సిబ్బంది, అలాగే వాలంటీర్లు ఈ గాలింపు ప్రచారంలో పాల్గొన్నారు. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కనుగొనే వరకు వారు నిరంతరం శ్రమించారని మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అల్-రషీది మరణానికి దారితీసిన ఆధారాల కోసం అన్వేషణను కొనసాగిస్తామని, మృతుల కుటుంబానికి మంత్రిత్వ శాఖ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







