వీధిఅరుగు ఆధ్వర్యంలో అత్యద్భుతంగా జరిగిన శకపురుషుని శతవసంతాలు వేడుకలు
- May 28, 2023
"వీధి అరుగు, నార్వే" ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 100 కి పైగా తెలుగు సాహిత్య సాంస్కతిక సంస్థల భాగస్వామ్యముతో నిర్వహించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కీ. శే. నందమూరి తారకరామారావు గారి శతవసంతోత్సవాలు ఎన్టీఆర్ ని ఒక ప్రత్యేకమైన రీతిలో గుర్తుచేసుకునే విధంగా అపూర్వముగా 27 మే 2023 నాడు అద్భుతంగా జరిగాయి. వందకు పైగా తెలుగు సంఘాలు పరిచయమైన ఈ వేదిక అనేక నక్షత్రాలను కలిపిన పాలపుంతలా తోచిందని పలువురు అభిప్రాయ పడ్డారు.
ఎన్టీఆర్ కి అంజలి ఘటిస్తూ ఘనంగా జరుపుకున్న “శకపురుషుని శతవసంతాలు" కార్యక్రమంని ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ఇప్పటివరకు 25-30k మంది వీక్షించారు.
ముఖ్య అతిథులుగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడు ముప్పవరపు గారు విచ్చేసి అందరికి శుభాశీస్సులు అందించారు. భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ "విలువలతో కూడిన రాజకీయాలకు నిజమైన నిర్వచనం ఎన్టీఆర్ అనీ, ఆయన వ్యక్తిత్వం భావితరాలకు మార్గదర్శనం అని దివంగత ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. తెలుగు భాష పరిరక్షణకు ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ పునరంకితం కావాలని వారు పిలుపునిచ్చారు. తెలుగు వారి హృదయాలపై చెరగని ముద్ర వేసిన నందమూరి తారకరామారావు శతజయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలు తెలుగు సంఘాలు భాగస్వామ్యం వహించటం అభినందనీయమని, ఎన్టీఆర్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఉన్న ఎల్లలు లేని అభిమానానికి ఇది నిదర్శమన్నారు.
అలాగే ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిధిగా వచ్చిన రామారావు కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి గారు మాట్లాడుతూ అద్భుతమైన ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, వారిని కూడా ఇందులో భాగం చేసినందుకుగాను హర్షం వ్యక్తం చేశారు.
ప్రముఖ చలనచిత్ర నటుడు మాగంటి మురళీమోహన్, ప్రముఖ చలనచిత్ర నిర్మాత చలసాని అశ్వనీదత్త్, నారా బ్రాహ్మణి, కె. లక్ష్మీనారాయణ, డా. విజయభాస్కర్ దీర్ఘాశి, గుమ్మడి గోపాలకృష్ణ, డా. శంకర నారాయణ తదితర ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.
వీధిఅరుగు ఆధ్వర్యంలో కార్యక్రమం మొదలు పెట్టినప్పటికీ, 40 దేశాల నుండి తెలుగుసంస్థలు అందించిన సహాకారం వెలకట్టలేనిది. ముఖ్యంగా, వివిధసంస్థల నుంచి అనేక మంది చిన్నారులు, పెద్దలు ఎన్టీఆర్ గారు నటించిన సినిమాల నుండి పద్యాలు, పాటలు, నృత్యాలు చేసి కార్యక్రమం అద్భుతంగా రావడంలో పెద్ద పాత్ర పోషించారు.
అంతర్జాలంలో అంతర్జాతీయంగా 14 గంటల పాటు నిర్విరామంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఎన్టీఆర్ గారి గొప్పతనాన్ని ముందు తరాలకు తెలియజేసేందుకు ఒక వారధి కాగలదని వీధిఅరుగు వ్యవస్థాపకులు వెంకట్ తరిగోపుల తెలియజేశారు.
ఈ కార్యక్రమం సమన్వయకర్తలుగా వ్యవహరించినవారు సుధాకర్ రావు కుదరవల్లి, విక్రమ్ సుఖవాసి, పావని రాగిపాని,నవీన్ సామ్రాట్ జలగడుగు, లక్ష్మణ్ వెన్నెపురెడ్డి, వై. భార్గవ్, శ్రీమతి లక్ష్మి రాయవరపు, శిరీష తూనుగుంట్ల, రాజగోపాల్ మోహన్ ఆరేటి, అశోక్ కుమార్ పారా.
ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన ప్రసార మధ్యమ సంస్థలకు, మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
చరిత్ర పుటల్లో నందమూరి తారక రామారావు పేరు స్వర్ణాక్షరాలతో నిలిపోయేలా అపూర్వమైన అద్భుతమైన “శకపురుషుని శతవసంతాలు” అంతర్జాల కార్యక్రమాన్ని సంకల్పించి అందరికీ భాగస్వామ్యం కల్పించి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వెంకట్ తరిగోపులకి, అలుపెరగకుండా పనిచేసిన ఆయన బృందానికి వివిధ సంస్థల అధినేతలు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.





తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









