తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు వేగేశ్న వరాలు
- June 02, 2023
హైదరాబాద్: గత 35 సంవత్సరాలుగా దివ్యాంగులకు ఎనలేని సేవలందిస్తున్న వేగేశ్న ఫౌండేషన్, కుంట్లూరు, రంగారెడ్డి జిల్లా వారు, తమ సేవలను, ఇక ముందు, రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపచేయనున్నది.వేగేశ్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు, వేగేశ్న ఫౌండేషన్ చైర్ పర్సన్ శైలజ సుంకరపల్లి ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు. శారీరక దివ్యాంగులైన పిల్లలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచితంగా చదువుకొనవచ్చును..అవసరమైన వారికి ఫిజియోథెరపీ, సర్జికల్ కరెక్షన్స్, కృత్రిమ అవయవాలు ఏర్పాటు లాంటి సౌకర్యాలను కూడా వేగేశ్న ఫౌండేషన్ కల్పిస్తున్నది.
అంతేకాకుండా,మానసిక వారికి పిల్లలకు కూడా ఉచిత సేవలందిస్తున్నది.తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో చదువుకుంటున్న దివ్యాంగులైన చిన్నారులకు కావాల్సిన సహకారం అందిస్తుంది.
ఆసక్తి కల వారు వేగేశ్న ఫౌండేషన్ చైర్ పర్సన్ శైలజ సుంకరపల్లి, రంగారెడ్డి జిల్లా, కుంట్లూర్, పెద్ద అంబర్పేట్ మున్సిపల్ పరిధి, వారిని జూన్ 12వ తారీకు తర్వాత సంప్రదించవచ్చును.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!









