సెప్టెంబర్ వరకు స్కెంజెన్ వీసా అపాయింట్మెంట్లు లేవు..!
- June 03, 2023
యూఏఈ: స్కెంజెన్ వీసా అపాయింట్మెంట్లను కోరుతున్న యూఏఈ నివాసితులు డిమాండ్ పెరుగుదల కారణంగా సెప్టెంబర్ వరకు వేచి ఉండాల్సి ఉంటుందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ప్రతిరోజూ 700 వరకు కాల్స్ వస్తున్నాయని, వీసా ప్రాసెసింగ్ సమయం తగ్గించబడినప్పటికీ, స్లాట్లు పూర్తిగా బుక్ అయినట్లు పేర్కొన్నారు. అనేక మంది యూఏఈ నివాసితులు ఇప్పుడు ఈద్ అల్ అదా విరామం కోసం తమ విదేశీ సెలవులను ఖరారు చేసుకుంటున్నారని గలాదరి బ్రదర్స్ ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్వీసెస్లో MICE, సెలవుల మేనేజర్ మీర్ వాసిం రాజా తెలిపారు.
ప్రీమియం వీసా సేవలు కూడా Dh400 అదనంగా చెల్లించడం ద్వారా ఎంచుకోవచ్చని, కానీ ఆ సేవలు కూడా ఇప్పుడు అందుబాటులో లేవని రీగల్ టూర్స్ వరల్డ్వైడ్లో ఇన్బౌండ్, అవుట్బౌండ్ కార్యకలాపాల సీనియర్ మేనేజర్ సుబైర్ తెకెపురాత్వలప్పిల్ తెలిపారు. అపాయింట్మెంట్కి రెట్టింపు డబ్బు చెల్లించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా.. కానీ అది తమ చేతుల్లో లేదన్నారు. వివిధ జాతీయతలకు చెందిన నివాసితులు స్కెంజెన్ దేశాలకు వెళ్లాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ముందుగా ప్లాన్ చేసుకున్న వారిలో చాలామంది వీసాలు పొందగలిగారు. చాలా మంది సంవత్సరం ప్రారంభంలో జనవరి నుండి ఫిబ్రవరి వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీసా జారీ చేసిన తర్వాత ఒక ప్రయాణికుడు అతను/ఆమె వీసా కోసం దరఖాస్తు చేసుకున్న దేశంలోకి ప్రవేశించడానికి ఆరు నెలల వ్యవధి ఇవ్వబడుతుంది.
యూరప్లోని స్కెంజెన్ ప్రాంతం చాలా కాలంగా యూఏఈ నుండి వచ్చే పర్యాటకులకు ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రత్యేక వీసాల కోసం దరఖాస్తు చేయకుండానే అనేక దేశాలను సందర్శించడానికి వీలు కల్పిస్తుంది. "వేసవి కాలం సమీపిస్తున్నందున, ఈద్ అల్ అధా విరామంతో పాటు నివాసితులు ప్రయాణించడానికి ఆసక్తిగా ఉన్నారు." అని సుబైర్ చెప్పారు. "ప్రయాణం చేయాలనే కోరిక, ప్రయాణ పరిమితులను క్రమంగా ఎత్తివేయడం, కోటా లేదా వీసాల స్లాట్లలో తగ్గింపు మరియు సెలవులు కూడా GCC నివాసితులలో ఆసక్తిని పెంచుతున్నాయి." అని పేర్కొన్నారు. వీసా పొందిన నివాసితులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఏజెంట్లు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







