మత్తు పానీయాలు తయారీ.. ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- June 04, 2023
బహ్రెయిన్: బుదయ్యలోని ఒక నివాసంలో మత్తు పానీయాల తయారు చేస్తున్న 29, 32 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు వ్యక్తులను బహ్రెయిన్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ అరెస్టులను ధృవీకరించింది. అనుమానితులను ఆసియా జాతీయత అని వెల్లడించింది. అధికారులకు అందిన సమాచారం మేరకు విచారణ జరిపి అరెస్టు చేశారు. అధికారులు దాడులు నిర్వహించి నిందితులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సంఘటన స్థలం నుంచి మద్యం తయారీ ప్రక్రియకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లతో సహా అక్రమ పానీయాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







