ఢిల్లీ లో 'నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు'ల ప్రదాన కార్యక్రమం
- May 12, 2016
'నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు'ల ప్రదాన కార్యక్రమాన్ని దేశరాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఏర్పాటు చేశారు. నర్సు వృత్తిలో విశేషమైన సేవలు అందించి ఎంతో మందికి సహాయం చేసినందుకు గాను కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ఈ అవార్డులను అందజేస్తుంది.
ఫ్లొరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఈ సందర్భంగా రోగులకు విశేష సేవలు అందించిన పలువురు నర్సులను రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









