ఢిల్లీ లో 'నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు'ల ప్రదాన కార్యక్రమం
- May 12, 2016
'నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు'ల ప్రదాన కార్యక్రమాన్ని దేశరాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఏర్పాటు చేశారు. నర్సు వృత్తిలో విశేషమైన సేవలు అందించి ఎంతో మందికి సహాయం చేసినందుకు గాను కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ఈ అవార్డులను అందజేస్తుంది.
ఫ్లొరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఈ సందర్భంగా రోగులకు విశేష సేవలు అందించిన పలువురు నర్సులను రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







