దాసరి అవార్డుకు అర్హుడు గూడ రామకృష్ణ
- June 08, 2023
హైదరాబాద్: ప్రముఖుల పేరిట బహుకరించే పురస్కారాలు అర్హులకు అందితే వాటికి గౌరవం పెరుగుతుందని వంశీ సంస్థల వ్యవస్థాపకుడు వంశీ రామరాజు అన్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దర్శకులు, దర్శకరత్న డా.దాసరి నారాయణరావు పేరిట స్థాపించిన అవార్డ్ అందుకున్న గూడ రామకృష్ణ అందుకు అర్హుడని అభినందించారు. శ్రీ త్యాగరాయ గాన సభ లోని కళా దీక్షితులు కళా వేదిక పై సుజారమణ కల్చరల్ అకాడెమీ నిర్వహణలో దర్శకరత్న దాసరి నారాయణ రావు సుజారమణ పురస్కారం సీనియర్ దర్శకుడు నటుడు గూడ రామకృష్ణ కు ప్రదానోత్సవ సభ జరిగింది. అధ్యక్షత వహించిన వంశీ రామ రాజు మాట్లాడుతూ కళా సంస్థలే దేవాలయాలు కళాకారులే దైవ స్వరూపాలు అన్నారు.ముఖ్య అతిధి గా పాల్గొన్న శత చిత్ర నిర్మాత సినీ విరాట్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ గూడ రామ కృష్ణ ఎన్నో ఏళ్ళు దాసరికి అత్యంత ప్రీతి పాత్ర శిష్యులు అన్నారు.. ఆయన తీసిన సినిమాలు ప్రభుత్వ అవార్డ్ పొందాయన్నారు.. అవార్డ్ గ్రహీత రామ కృష్ణ మాట్లాడుతూ దాసరి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఆయన అంత సహృదయులు లేరని అన్నారు. గాయని శ్రీమణి పాల్గొన్న సభకు రమణా రావు స్వాగతం పలికారు. సుజారమణ,సనత్ కుమార్, శ్రీనివాస్,అనూష శశి రేఖ, కె వి రావు తదితరుల పాటలు ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు









