దాసరి అవార్డుకు అర్హుడు గూడ రామకృష్ణ
- June 08, 2023
హైదరాబాద్: ప్రముఖుల పేరిట బహుకరించే పురస్కారాలు అర్హులకు అందితే వాటికి గౌరవం పెరుగుతుందని వంశీ సంస్థల వ్యవస్థాపకుడు వంశీ రామరాజు అన్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దర్శకులు, దర్శకరత్న డా.దాసరి నారాయణరావు పేరిట స్థాపించిన అవార్డ్ అందుకున్న గూడ రామకృష్ణ అందుకు అర్హుడని అభినందించారు. శ్రీ త్యాగరాయ గాన సభ లోని కళా దీక్షితులు కళా వేదిక పై సుజారమణ కల్చరల్ అకాడెమీ నిర్వహణలో దర్శకరత్న దాసరి నారాయణ రావు సుజారమణ పురస్కారం సీనియర్ దర్శకుడు నటుడు గూడ రామకృష్ణ కు ప్రదానోత్సవ సభ జరిగింది. అధ్యక్షత వహించిన వంశీ రామ రాజు మాట్లాడుతూ కళా సంస్థలే దేవాలయాలు కళాకారులే దైవ స్వరూపాలు అన్నారు.ముఖ్య అతిధి గా పాల్గొన్న శత చిత్ర నిర్మాత సినీ విరాట్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ గూడ రామ కృష్ణ ఎన్నో ఏళ్ళు దాసరికి అత్యంత ప్రీతి పాత్ర శిష్యులు అన్నారు.. ఆయన తీసిన సినిమాలు ప్రభుత్వ అవార్డ్ పొందాయన్నారు.. అవార్డ్ గ్రహీత రామ కృష్ణ మాట్లాడుతూ దాసరి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఆయన అంత సహృదయులు లేరని అన్నారు. గాయని శ్రీమణి పాల్గొన్న సభకు రమణా రావు స్వాగతం పలికారు. సుజారమణ,సనత్ కుమార్, శ్రీనివాస్,అనూష శశి రేఖ, కె వి రావు తదితరుల పాటలు ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!







