తన కుమార్తె ఫస్ట్లుక్ను షేర్ చేసిన షేఖా లతీఫా
- June 20, 2023
యూఏఈ: దుబాయ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అథారిటీ చైర్పర్సన్ షేఖా లతీఫా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన నవజాత కుమార్తె మొదటి చిత్రాన్ని ప్రపంచంతో పంచుకున్నారు. గత నెలలో జన్మించిన ఆమె కుమార్తెకు హింద్ బిన్ ఫైసల్ అని పేరు పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో ఆమె తన భర్త ఫైసల్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమీతో కలిసి ఉన్న తన నవజాత కుమార్తె చిత్రాన్ని పంచుకుంది. షేక్ లతీఫా షేక్ ఫైసల్ బిన్ సౌద్ బిన్ ఖలీద్ అల్ ఖాసిమిని 2016లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జూలై 2018లో ఓ బాబు జన్మించాడు. 2020 అక్టోబర్ లో రెండవ సంతానంగా పాప జన్మించింది. ఆమె సోదరుడు, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో తన మూడవ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







