తన కుమార్తె ఫస్ట్లుక్ను షేర్ చేసిన షేఖా లతీఫా
- June 20, 2023
యూఏఈ: దుబాయ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అథారిటీ చైర్పర్సన్ షేఖా లతీఫా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన నవజాత కుమార్తె మొదటి చిత్రాన్ని ప్రపంచంతో పంచుకున్నారు. గత నెలలో జన్మించిన ఆమె కుమార్తెకు హింద్ బిన్ ఫైసల్ అని పేరు పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో ఆమె తన భర్త ఫైసల్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమీతో కలిసి ఉన్న తన నవజాత కుమార్తె చిత్రాన్ని పంచుకుంది. షేక్ లతీఫా షేక్ ఫైసల్ బిన్ సౌద్ బిన్ ఖలీద్ అల్ ఖాసిమిని 2016లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జూలై 2018లో ఓ బాబు జన్మించాడు. 2020 అక్టోబర్ లో రెండవ సంతానంగా పాప జన్మించింది. ఆమె సోదరుడు, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో తన మూడవ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









