తన కుమార్తె ఫస్ట్లుక్ను షేర్ చేసిన షేఖా లతీఫా
- June 20, 2023
యూఏఈ: దుబాయ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అథారిటీ చైర్పర్సన్ షేఖా లతీఫా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన నవజాత కుమార్తె మొదటి చిత్రాన్ని ప్రపంచంతో పంచుకున్నారు. గత నెలలో జన్మించిన ఆమె కుమార్తెకు హింద్ బిన్ ఫైసల్ అని పేరు పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో ఆమె తన భర్త ఫైసల్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమీతో కలిసి ఉన్న తన నవజాత కుమార్తె చిత్రాన్ని పంచుకుంది. షేక్ లతీఫా షేక్ ఫైసల్ బిన్ సౌద్ బిన్ ఖలీద్ అల్ ఖాసిమిని 2016లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జూలై 2018లో ఓ బాబు జన్మించాడు. 2020 అక్టోబర్ లో రెండవ సంతానంగా పాప జన్మించింది. ఆమె సోదరుడు, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో తన మూడవ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







