రాయబారులకు శుభాకాంక్షలు తెలిపిన మెజెస్టి ది సుల్తాన్

- June 20, 2023 , by Maagulf
రాయబారులకు శుభాకాంక్షలు తెలిపిన మెజెస్టి ది సుల్తాన్

మస్కట్: అల్ బరాకా ప్యాలెస్‌లో సోమవారం సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌కు నియమించబడిన అనేక దేశాల రాయబారుల ధ్రువీకరణ పత్రాలను హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ స్వీకరించారు. మెజెస్టి ది సుల్తాన్ నుంచి లెంకా మిహాలికోవా (స్లోవాక్ రిపబ్లిక్), పాస్కల్ హుబెర్ గ్రెగోయిర్(బెల్జియం), ఆల్ఫ్రెడ్ గకుబా కాలిసా(రిపబ్లిక్ ఆఫ్ రువాండా), గై ఇబ్రహీం మెంబౌరౌ(గాబోనీస్ రిపబ్లిక్), డాంగ్ జువాన్ డంగ్(సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం), వ్లాదిమిర్ ఆండ్రెస్ గొంజాలెజ్(రిపబ్లిక్ ఆఫ్ క్యూబా), నూనో వాల్టియర్ మథియాస్(రిపబ్లిక్ ఆఫ్ పోర్చుగల్),కార్లోస్ రోడోల్ఫో జపాటా(పెరూ రిపబ్లిక్), సాసో పోడ్లెస్నిక్(రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా)లు ధృవీకరణ పత్రాలను అందుకున్నారు.

 ఒమానీ ప్రజలు, వారి దేశాల పౌరుల ఉమ్మడి ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా వివిధ రంగాలలో ఒమన్‌తో తమ దేశాల సంబంధాలను ప్రోత్సహించడానికి వారు చిత్తశుద్ధితో కృషి చేయాలని సుల్తాన్ కోరారు. హిస్ మెజెస్టి ది సుల్తాన్ రాయబారులకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com