రాయబారులకు శుభాకాంక్షలు తెలిపిన మెజెస్టి ది సుల్తాన్
- June 20, 2023
మస్కట్: అల్ బరాకా ప్యాలెస్లో సోమవారం సుల్తానేట్ ఆఫ్ ఒమన్కు నియమించబడిన అనేక దేశాల రాయబారుల ధ్రువీకరణ పత్రాలను హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ స్వీకరించారు. మెజెస్టి ది సుల్తాన్ నుంచి లెంకా మిహాలికోవా (స్లోవాక్ రిపబ్లిక్), పాస్కల్ హుబెర్ గ్రెగోయిర్(బెల్జియం), ఆల్ఫ్రెడ్ గకుబా కాలిసా(రిపబ్లిక్ ఆఫ్ రువాండా), గై ఇబ్రహీం మెంబౌరౌ(గాబోనీస్ రిపబ్లిక్), డాంగ్ జువాన్ డంగ్(సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం), వ్లాదిమిర్ ఆండ్రెస్ గొంజాలెజ్(రిపబ్లిక్ ఆఫ్ క్యూబా), నూనో వాల్టియర్ మథియాస్(రిపబ్లిక్ ఆఫ్ పోర్చుగల్),కార్లోస్ రోడోల్ఫో జపాటా(పెరూ రిపబ్లిక్), సాసో పోడ్లెస్నిక్(రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా)లు ధృవీకరణ పత్రాలను అందుకున్నారు.
ఒమానీ ప్రజలు, వారి దేశాల పౌరుల ఉమ్మడి ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా వివిధ రంగాలలో ఒమన్తో తమ దేశాల సంబంధాలను ప్రోత్సహించడానికి వారు చిత్తశుద్ధితో కృషి చేయాలని సుల్తాన్ కోరారు. హిస్ మెజెస్టి ది సుల్తాన్ రాయబారులకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







