ఐరాసా నుంచి ప్రపంచానికి ప్రధాని మోదీ ‘యోగా డే’ సందేశం
- June 21, 2023
అమెరికా: భారతదేశంలో పురాతన సంప్రదాయమైన యోగాకి కాపీరైట్లు, పేటెంట్లు లేవని.. రాయల్టీ చెల్లింపులు లేకుండా ఉచితంగా అందరికీ చేరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం యోగా డే సందర్భంగా ఆయన అమెరికాలో ఉన్న ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. యోగా అనేది వయసు, లింగ బేధం లేకుండా అందరికీ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ఇస్తుందని మోదీ చెప్పుకొచ్చారు. యోగా నేడు విశ్వవ్యాప్తమైందని, ప్రపంచ నలుమూలలా వ్యాపించిందని అన్నారు.
కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అతి ఎక్కువ దేశాలు పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో గిన్నీస్ ప్రపంచ రికార్డు వారు.. ఐక్య రాజ్య సమితిలో భారత ప్రతినిధికి ఈ విషయమై గుర్తింపు పత్రాన్ని అందజేశారు. యోగా డేకి వచ్చిన అతిథులతో కలిసి ప్రధాని మోదీ యోగా చేశారు. యోగా అనేది ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటమే కాకుండా, మనతో, పరస్పరం దయగా ఉండేందుకు వినియోగించాలని ప్రపంచ దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. స్నేహం, శాంతియుత ప్రపంచం, పరిశుభ్రమైన, పచ్చటి, స్థిరమైన భవిష్యత్తుకు యోగా ఉపకరిస్తుందని అన్నారు. ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు లక్ష్యాన్ని సాధించడానికి అందరూ చేతులు కలపాలని మోదీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







