ఐరాసా నుంచి ప్రపంచానికి ప్రధాని మోదీ ‘యోగా డే’ సందేశం
- June 21, 2023
అమెరికా: భారతదేశంలో పురాతన సంప్రదాయమైన యోగాకి కాపీరైట్లు, పేటెంట్లు లేవని.. రాయల్టీ చెల్లింపులు లేకుండా ఉచితంగా అందరికీ చేరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం యోగా డే సందర్భంగా ఆయన అమెరికాలో ఉన్న ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. యోగా అనేది వయసు, లింగ బేధం లేకుండా అందరికీ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ఇస్తుందని మోదీ చెప్పుకొచ్చారు. యోగా నేడు విశ్వవ్యాప్తమైందని, ప్రపంచ నలుమూలలా వ్యాపించిందని అన్నారు.
కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అతి ఎక్కువ దేశాలు పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో గిన్నీస్ ప్రపంచ రికార్డు వారు.. ఐక్య రాజ్య సమితిలో భారత ప్రతినిధికి ఈ విషయమై గుర్తింపు పత్రాన్ని అందజేశారు. యోగా డేకి వచ్చిన అతిథులతో కలిసి ప్రధాని మోదీ యోగా చేశారు. యోగా అనేది ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటమే కాకుండా, మనతో, పరస్పరం దయగా ఉండేందుకు వినియోగించాలని ప్రపంచ దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. స్నేహం, శాంతియుత ప్రపంచం, పరిశుభ్రమైన, పచ్చటి, స్థిరమైన భవిష్యత్తుకు యోగా ఉపకరిస్తుందని అన్నారు. ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు లక్ష్యాన్ని సాధించడానికి అందరూ చేతులు కలపాలని మోదీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!







