శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై శ్వేతపత్రం విడుదల..
- June 23, 2023
తిరుమల: తిరుమల శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై శ్వేతపత్రం విడుదల అయింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. శ్రీవాణి ట్రస్ట్ కు ఇప్పటివరకు రూ. 861 కోట్ల విరాళాలు వచ్చాయని తెలిపారు. బ్యాంకుల్లో రూ. 603 కోట్లు డిపాజిట్ చేశామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
వివిధ బ్యాంకుల్లో రూ. 139 కోట్లు ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ డిపాజిట్లపై రూ. 36 కోట్ల వడ్డీ వచ్చిందని తెలిపారు. ఆలయాల నిర్మాణానికి ఇప్పటివరకు రూ.120 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు.
ఇచ్చిన విరాళాలకు రసీదులు ఇస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.దళారీ వ్యవస్థను అరికట్టేందుకే శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేశామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 70 మంది దళారులను అరెస్టు చేసి, 214 మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!









