నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు

- June 30, 2026 , by Maagulf
నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు

నంద్యాల: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నిర్వహిస్తున్న నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలోని పదవుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మంగళవారం రెండో రోజు నంద్యాలలో కొనసాగింది.

నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ఆధ్వర్యంలో 27 మంది సభ్యులతో కూడిన సమాచార సేకరణ కమిటీ బృందం నంద్యాలలోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో ఆసక్తి కలిగిన జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల నుంచి వివిధ స్థాయిల్లోని పార్టీ పదవులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించింది.

ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతానికి అర్హులైన నాయకులను గుర్తించి బాధ్యతలు అప్పగించే ప్రక్రియలో భాగంగానే ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్ పరిధిలోని పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు హాజరై వివిధ పదవులకు దరఖాస్తులు సమర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com