డైవింగ్ తర్వాత కొన్ని గంటల్లోనే టైటాన్ పేలింది: యూఎస్ నేవీ
- June 24, 2023
యూఏఈ: ఆదివారం టైటానిక్ షిప్బ్రెక్ను అన్వేషించడానికి బయలుదేరిన కొద్ది గంటలకే టైటాన్ పేలిపోయినట్లు భావిస్తున్నట్లు యుఎస్ నావికాదళం తెలిపింది. యూఎస్ నావికాదళం ధ్వని డేటాను విశ్లేషించింది. టైటాన్ తప్పిపోయిన ప్రాంతంలో పేలుడుకు అనుగుణంగా ఒక అసాధారణతను గుర్తించినట్టు యూఎస్ నేవీ సీనియర్ అధికారి మీడియాతో చెప్పారు. "ఖచ్చితమైనది కానప్పటికీ, కొనసాగుతున్న శోధన మరియు రెస్క్యూ మిషన్లో సహాయం చేయడానికి ఈ సమాచారం వెంటనే ఇన్సిడెంట్ కమాండర్తో షేర్ చేశాం" అని పేర్కొన్నారు. అట్లాంటిక్లో తప్పిపోయిన టైటానిక్ ఎక్స్డిషన్ సబ్మెరైన్లో ఉన్న ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ ధృవీకరించింది. టైటానిక్ ఎక్స్పెడిషన్ సబ్మెర్సిబుల్లో ఎక్కిన ఐదుగురు అన్వేషకులు ఇప్పుడు చనిపోయారని భావిస్తున్నట్లు టైటాన్ ఆపరేటర్ ఓషన్గేట్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. "మా CEO స్టాక్టన్ రష్, షాజాదా దావూద్ మరియు అతని కుమారుడు సులేమాన్ దావూద్, హమీష్ హార్డింగ్ , పాల్-హెన్రీ నార్జియోలెట్ పాపం కోల్పోయారని మేము ఇప్పుడు విశ్వసిస్తున్నాము" అని ప్రకటన పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







