పోడు పట్టాలను పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్
- June 30, 2023
తెలంగాణ: మహబూబాబాద్ జిల్లాలోని గుమ్మడూరులో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఇందులో భాగంగా 24వేల 181 మంది పోడు రైతులకు 67వేల 730 ఎకరాలకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. అదేవిధంగా రామచంద్రాపురం కాలనీలో 200 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి లబ్దిదారులకు ఇంటిపేపర్లను అందజేశారు. అంతకుముందు మానుకోటలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద 50కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ది పనుల పైలాన్ను ఆవిష్కరించారు. జులై 8న మోదీ వరంగల్ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. మెడికల్ కాలేజీలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వేకోచ్ ఇవ్వమని మోదీ ఎందుకు వస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడిన తెలంగాణలో ఇప్పుడు సీఎం కేసీఆర్ వల్లే పోడు రైతులకు పట్టాలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి సహాయం చేయడం లేదంటూ మండిపడ్డారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







