గెలుపే లక్ష్యంగా పనిచేయండి.. పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం
- August 19, 2026
అమరావతి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నాయకులు, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులతో ఆయన ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు పలువురు ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాల పై జగన్ విమర్శలు
ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత తీవ్రమవుతోందని, ఆ ప్రజా ఆగ్రహాన్ని కప్పిపుచ్చేందుకు రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల దృష్టిని వేరే అంశాలపైకి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో ఘోర అగ్నిప్రమాదం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
- షార్జాలో వాహన నంబర్ ప్లేట్ల సేకరణ సర్వీస్.. నూన్తో పోలీసుల భాగస్వామ్యం
- ఏపీ మున్సిపల్ పోరుకు సర్కార్ సిద్ధం..
- జెడ్డాలో ‘ఇండియా ఉత్సవ్’లో పాల్గొన్న కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి
- గెలుపే లక్ష్యంగా పనిచేయండి.. పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం
- తప్పుదారి పట్టించిన డ్రైవింగ్.. అబుదాబిలో డ్రైవర్కు 6 నెలల జైలు, Dh100,000 జరిమానా
- డేటింగ్ యాప్ ద్వారా వల.. నలుగురిపై కేసు నమోదు..!!
- ఖతార్ లో అధిక విద్యుత్ వినియోగ పరికరాల ఏర్పాటుపై అలెర్ట్..!!
- అక్టోబర్ 1న అల్ షహీద్ పార్క్ ఫేజ్-3 ప్రారంభం..!!
- సౌదీ బార్డర్ చట్ట ఉల్లంఘన.. సౌదీ సిటిజన్ అరెస్ట్..!!







