పర్యాటక ప్రాంతాంగా షార్జా 'బరీడ్ విలేజ్'
- July 06, 2023
యూఏఈ: ఎడారిలో దాదాపు సగం వరకు కప్పబడిన షార్జా విలేజ్ ‘బరీడ్ విలేజ్’ ప్రముఖ పర్యాటక కేంద్రంగా మలిచేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు అయిన హిస్ హైనెస్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి, అల్ మేడమ్లోని పురాణ 'బరీడ్ విలేజ్'ని సంరక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. సందర్శకులు, పర్యాటకుల కోసం ఘురైఫా గ్రామాన్ని సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అల్ మేడమ్కు నైరుతి దిశలో 2కిమీ దూరంలో ఉన్న ఈ పాడుబడిన గ్రామంలో రెండు వరుసల ఒకే రకమైన ఇళ్లు, రోడ్డు చివర ఒక మసీదు ఉన్నాయి. ఇది 'బరీడ్ విలేజ్' పేరు పొందింది. ఇక్కడున్న వారికి ప్రభుత్వం కొత్త ఇళ్లను అందించడంతో 1999లో ఇక్కడి నివాసితులు దానిని విడిచిపెట్టారు. అనంతరం కాలంలో ఇసుక పరిమాణం పెరగడంతో గ్రామం మొత్తం ఇసుకతో కప్పబడింది.
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









