పర్యాటక ప్రాంతాంగా షార్జా 'బరీడ్ విలేజ్'
- July 06, 2023
యూఏఈ: ఎడారిలో దాదాపు సగం వరకు కప్పబడిన షార్జా విలేజ్ ‘బరీడ్ విలేజ్’ ప్రముఖ పర్యాటక కేంద్రంగా మలిచేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు అయిన హిస్ హైనెస్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి, అల్ మేడమ్లోని పురాణ 'బరీడ్ విలేజ్'ని సంరక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. సందర్శకులు, పర్యాటకుల కోసం ఘురైఫా గ్రామాన్ని సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అల్ మేడమ్కు నైరుతి దిశలో 2కిమీ దూరంలో ఉన్న ఈ పాడుబడిన గ్రామంలో రెండు వరుసల ఒకే రకమైన ఇళ్లు, రోడ్డు చివర ఒక మసీదు ఉన్నాయి. ఇది 'బరీడ్ విలేజ్' పేరు పొందింది. ఇక్కడున్న వారికి ప్రభుత్వం కొత్త ఇళ్లను అందించడంతో 1999లో ఇక్కడి నివాసితులు దానిని విడిచిపెట్టారు. అనంతరం కాలంలో ఇసుక పరిమాణం పెరగడంతో గ్రామం మొత్తం ఇసుకతో కప్పబడింది.
తాజా వార్తలు
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!









