తానా మహా సభలకు ముఖ్యఅతిథిగా వెంకయ్య నాయుడు
- July 06, 2023
హైదరాబాద్: అమెరికా ఫిలడెల్ఫియాలో నిర్వహించనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహా సభలకు భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ మహా సభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాల్లో జులై 7 నుంచి 9 వరకు జరగనున్నాయి. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులకు శ్రీ వెంకయ్య నాయుడు అమెరికా కాలమానం ప్రకారం ఈనెల 7న సాయంత్రం తానా పురస్కారాలను అందజేయనున్నారు. ఈనెల 8న ఉదయం తానా మహా సభలను వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారు. అనంతరం ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తానా సదస్సును ఉద్దేశించి కీలక ఉపన్యాసం చేస్తారు. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల పదో తేదీ సాయంత్రం వాషింగ్టన్ డిసి లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి శ్రీ వెంకయ్య నాయుడు ప్రసంగిస్తారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







