తానా మహా సభలకు ముఖ్యఅతిథిగా వెంకయ్య నాయుడు
- July 06, 2023
హైదరాబాద్: అమెరికా ఫిలడెల్ఫియాలో నిర్వహించనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహా సభలకు భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ మహా సభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాల్లో జులై 7 నుంచి 9 వరకు జరగనున్నాయి. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులకు శ్రీ వెంకయ్య నాయుడు అమెరికా కాలమానం ప్రకారం ఈనెల 7న సాయంత్రం తానా పురస్కారాలను అందజేయనున్నారు. ఈనెల 8న ఉదయం తానా మహా సభలను వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారు. అనంతరం ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తానా సదస్సును ఉద్దేశించి కీలక ఉపన్యాసం చేస్తారు. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల పదో తేదీ సాయంత్రం వాషింగ్టన్ డిసి లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి శ్రీ వెంకయ్య నాయుడు ప్రసంగిస్తారు.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









