తానా మహా సభలకు ముఖ్యఅతిథిగా వెంకయ్య నాయుడు
- July 06, 2023
హైదరాబాద్: అమెరికా ఫిలడెల్ఫియాలో నిర్వహించనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహా సభలకు భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ మహా సభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాల్లో జులై 7 నుంచి 9 వరకు జరగనున్నాయి. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులకు శ్రీ వెంకయ్య నాయుడు అమెరికా కాలమానం ప్రకారం ఈనెల 7న సాయంత్రం తానా పురస్కారాలను అందజేయనున్నారు. ఈనెల 8న ఉదయం తానా మహా సభలను వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారు. అనంతరం ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తానా సదస్సును ఉద్దేశించి కీలక ఉపన్యాసం చేస్తారు. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల పదో తేదీ సాయంత్రం వాషింగ్టన్ డిసి లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి శ్రీ వెంకయ్య నాయుడు ప్రసంగిస్తారు.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









