తానా మహా సభలకు ముఖ్యఅతిథిగా వెంకయ్య నాయుడు

- July 06, 2023 , by Maagulf
తానా మహా సభలకు ముఖ్యఅతిథిగా వెంకయ్య నాయుడు

హైదరాబాద్: అమెరికా ఫిలడెల్ఫియాలో నిర్వహించనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA)  23వ మహా సభలకు  భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.  ఈ మహా సభలు  ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాల్లో జులై 7 నుంచి 9  వరకు జరగనున్నాయి.  వివిధ రంగాల్లో  సేవలందిస్తున్న ప్రముఖులకు శ్రీ వెంకయ్య నాయుడు అమెరికా కాలమానం ప్రకారం ఈనెల 7న సాయంత్రం  తానా పురస్కారాలను అందజేయనున్నారు. ఈనెల 8న ఉదయం తానా మహా సభలను  వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారు. అనంతరం ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తానా సదస్సును ఉద్దేశించి కీలక ఉపన్యాసం చేస్తారు. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల పదో తేదీ సాయంత్రం వాషింగ్టన్ డిసి లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి శ్రీ వెంకయ్య నాయుడు ప్రసంగిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com