తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు ఖరారు
- July 06, 2023
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అలోక్ ఆరాధేలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత హైకోర్టు సీజే జస్టిస్ పీకే మిశ్రా మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు. ఈ క్రమంలో బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ను ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధేను తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సూచించింది. 2013లో జమ్మూ-కాశ్మీర్ హైకోర్టు కు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ధీరజ్ సింగ్... 2022 నుంచి బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. గత సంవత్సరం ఈయనను మణిపూర్ హైకోర్టుకు కొలీజియం సిఫార్సు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం తేల్చకపోవడంతో దానిని రద్దు చేశారు.
మధ్యప్రదేశ్కు చెందిన జస్టిస్ అలోక్ 2009 డిసెంబరులో అదే రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నుంచి కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. తెలంగాణ, ఏపీలతో సహా.. 7 రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్లు రానున్నారు.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









