7.3 మిలియన్ల మంది ప్రయాణికులతో కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్ట్ రికార్డు
- July 10, 2023
రియాద్: రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2023 రెండవ త్రైమాసికంలో 7.3 మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. 2019లో 7.1 మిలియన్ల మంది ప్రయాణికులు రికార్డును తాజాగా అధిగమించింది. ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో సగటు రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 80,000 కంటే ఎక్కువగా నమోదైంది. ఈమేరకు రియాద్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ కార్యాచరణ పనితీరు నివేదికలో పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, విమానాల సంఖ్య ఆరు శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2019 రెండవ త్రైమాసికం(48 వేలు)తో పోలిస్తే విమానాల సంఖ్య 51 వేలకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో 24 దేశీయ గమ్యస్థానాలు, 66 అంతర్జాతీయ గమ్యస్థానాలతో సహా 90 గమ్యస్థానాలకు చేరుకుంది. ఇది 4.6 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. రవాణా, సరుకు రవాణా సేవలను అందించే వాణిజ్య విమానయాన సంస్థలు 2019లో 39 కంపెనీలు ఉండగా.. నేడు వాటి సంఖ్య 30 శాతం పెరిగి 51 కంపెనీలకు చేరింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







