7.3 మిలియన్ల మంది ప్రయాణికులతో కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్ట్ రికార్డు
- July 10, 2023
రియాద్: రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2023 రెండవ త్రైమాసికంలో 7.3 మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. 2019లో 7.1 మిలియన్ల మంది ప్రయాణికులు రికార్డును తాజాగా అధిగమించింది. ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో సగటు రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 80,000 కంటే ఎక్కువగా నమోదైంది. ఈమేరకు రియాద్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ కార్యాచరణ పనితీరు నివేదికలో పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, విమానాల సంఖ్య ఆరు శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2019 రెండవ త్రైమాసికం(48 వేలు)తో పోలిస్తే విమానాల సంఖ్య 51 వేలకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో 24 దేశీయ గమ్యస్థానాలు, 66 అంతర్జాతీయ గమ్యస్థానాలతో సహా 90 గమ్యస్థానాలకు చేరుకుంది. ఇది 4.6 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. రవాణా, సరుకు రవాణా సేవలను అందించే వాణిజ్య విమానయాన సంస్థలు 2019లో 39 కంపెనీలు ఉండగా.. నేడు వాటి సంఖ్య 30 శాతం పెరిగి 51 కంపెనీలకు చేరింది.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









