తెలంగాణలో బుధవారం విద్యా సంస్థలు బంద్..
- July 10, 2023
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి అఖిల భారత విద్యార్థి సంఘం (ABVP). ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల వసూలుకు వ్యతిరేకంగా ఏబీవీపీ గత కొద్దీ రోజులుగా ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో జూలై 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ విద్యా సంస్థలను మూసివేయించాయి. ఇక ఇప్పుడు తెలంగాణలో విద్యా రంగంలో జరుగుతోన్న అక్రమ ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా జులై 12వ తేదీన విద్యా సంస్థలు బంద్ చేయాలంటూ పిలుపునిచ్చింది.
తాజాగా ఏఐఎస్ఎఫ్ నాయకులు హైదరాబాద్లోని కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు రకాల అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ నాయకులు విమర్శించారు. విద్యా రంగానికి బడ్జెట్లో సరైన కేటాయింపులు చేయడం లేదంటూ, విద్యార్థుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందంటూ ఆరోపించారు. విద్యా రంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిలంచాలని, స్కూల్ ఫీజులను తగ్గించాలనే డిమాండ్తో జులై 12వ తేదీ (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ బంద్ చేయాలంటూ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







