మహిళలు, చిన్నారులు సహా 24 మందిని కాపాడిన వ్యక్తికి సన్మానం
- July 13, 2023
దుబాయ్: అగ్నిప్రమాదం నుండి మహిళలు, పిల్లలతో సహా 24 మంది వ్యక్తుల ప్రాణాలను రక్షించిన దుబాయ్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్తో కలిసి పనిచేస్తున్న మొదటి కార్పోరల్ గదీర్ హమూద్ అల్ కాబీని ఘనంగా సన్మానించారు. అల్ కాబీ ఆ ప్రాంతం గుండా వెళుతుండగా అగ్నిప్రమాదం చోటుచేసుకోవడాన్ని గమనించి అలెర్ట్ అయ్యాడు. సమయాన్ని వృథా చేయకుండా.. ప్రధాన ద్వారాన్ని తెరిచి లోపలికి వెళ్లి మహిళలు, పిల్లలతో సహా అందరినీ బయటకు తీసుకొచ్చాడు. సివిల్ డిఫెన్స్ బృందాలు వచ్చే వరకు గాయపడిన వారిలో ఒకరికి ప్రథమ చికిత్స కూడా అందించాడు. అల్ కాబీని జెబెల్ అలీ పోలీస్ స్టేషన్ డైరెక్టర్, పోలీస్ స్టేషన్ల డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ మేజర్ జనరల్ డాక్టర్ అదెల్ అల్ సువైదీ సమక్షంలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్, మేజర్ జనరల్ ఎక్స్పర్ట్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సూరి సత్కరించారు. మంటలు, పొగతో చుట్టుముట్టబడిన ఇంట్లోకి ప్రవేశించి లోపల ఉన్నవారి ప్రాణాలను, ఆస్తులను రక్షించడంలో వేగంగా స్పందించినందుకు అల్ కాబీకి అల్ మన్సూరి ఫస్ట్ కార్పోరల్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







